టాలీవుడ్ లోకి కంగనా రీ ఎంట్రీ... కథిదే ?

VAMSI
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోయిన్ గా నిర్మాతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా... సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది. హిందీ హీరోయిన్ గా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో భారీ పారితోషికాలు అందుకుంటున్న నటులలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్లోనూ ఏక్ నిరంజన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఈ మద్యకాలంలో సోషల్ మీడియా వలన మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇపుడు తాజాగా ఓ తెలుగు సినిమాకు కంగనా సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలు తో దూసుకుపోతున్న ఈమె ఇప్పుడు తెలుగులోనూ అదే తరహా చిత్రానికి ఓకే చెప్పినట్లు సినీ సర్కిల్స్లో టాక్.
టాలీవుడ్ అగ్ర దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో  వెంటనే సరే తప్పకుండా చేద్దాం అన్నారట కంగనా. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే త్వరలో ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రల కోసం స్టార్ హీరోలను ఆ డైరెక్టర్ సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే ఒకరిద్దరు హీరోలు ఒకే చెప్పగా... మిగిలిన వారు డేట్స్ అడ్జస్ట్ చేయలేక కుదరదు సార్ అని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కంగనతో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇటీవలే 'తలైవి' చిత్రంలో నటించారు కంగనారనౌత్.  దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత నిజ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తమిళ తెలుగు హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కంగనా జయలలిత గారి పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: