ఆ నలుగురి చేతిలో టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఐదవ శక్తి ఇతడేనా.. ?

Mamatha Reddy
టాలీవుడ్ సినీ పరిశ్రమ ఓ నలుగురు పెద్దమనుషుల చేతిలో ఉందని గత కొన్ని రోజులుగా ఎంతో మంది ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురు ఎవరో అందరికీ తెలిసినా పైకి మాత్రం చెప్పరు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఏ సినిమా బయటకు రావాలన్నా డబ్బింగ్ సినిమా విడుదల కావాలన్న ఈ నలుగురిలో ఎవరో ఒకరు మాత్రమే చేస్తారు. వీరు సిండికేట్ గా మారి ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ను ఎదగనివ్వడం లేదని ఒక ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. కొంతమంది అప్పుడే ఎదుగుతున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా ఈ నలుగురు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు వీరందరికీ ప్రత్యామ్నాయంగా ఓ ఐదవ శక్తి పుట్టుకొస్తుందని టాలీవుడ్ లో కొత్తగా ఓ కొత్త వర్గం పుట్టబోతుంది అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో దశాబ్దాలపాటు నైజాం పంపిణీదారుగా ఎగ్జిబిటర్ కం ఫైనాన్షియర్ గా నారాయణ దాస్ నారంగ్ అందరికీ పరిచయమైన వ్యక్తి. ప్రస్తుతం నిర్మాతగా కూడా పరిశ్రమకు సేవలందిస్తూ ఆయన ఏషియన్ సినిమాస్ అధినేతగా ఉన్నాడు. ఇటీవలే మహేష్ బాబుతో కలిసి ఆయన ఏఎంబీ సినిమాస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

దేశంలోనే ఉత్తమ మల్టీప్లెక్స్ లలో ఒకటిగా నిలిచింది ఏషియన్ సినిమాస్. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి వారితో కలిసి ఆయన మల్టీప్లెక్స్ ల నిర్మాణంలో భాగంగా ఉన్నారు. పంపిణీ రంగంలో ఏసియన్ సినిమాస్ అనేక పాపులర్ తమిళ చిత్రాలను కూడా తెలుగులో విడుదల చేస్తోంది. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ భారీ చిత్రాలను కూడా నిర్మిస్తోంది. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరు హీరోలతో ఆయన సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు సైతం ఆయన తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నలుగురు చేతిల్లో మాత్రమే కాదు ఐదవ శక్తి గా నారాయణదాస్ ఎదుగుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: