బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..?

Anilkumar
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'.ఇక ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందో అప్పటినుంచి ఈ సినిమాకి అన్నీ అడ్డంకులే ఏర్పడుతున్నాయి.మొదట కరోనా మహమ్మారి పుష్ప కి పెద్ద షాక్ ఇచ్చింది.ఇక తర్వాత ఈ సినిమా మేకర్స్ మధ్య తలెత్తిన కొన్ని ఇగోల వల్ల కూడా పుష్ప ని కొన్ని రోజులు ఆపేశారు.ఇక ఆ తర్వాత మరికొన్ని సమస్యల మధ్యనే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది.ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ తిరిగి హైదరాబాద్ లోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ కూడా ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఇక ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది.ఇంతలోనే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దానికి కారణం ఈ సినిమా దర్శకుడు సుకుమార్. తాజాగా సుకుమార్ కి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.ఆయనకి  వైరల్ ఫీవర్ సోకింది.నిజానికి గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూనే సుకుమార్ షూటింగ్ చేస్తున్నారు.కానీ ఈ రోజు జ్వరం మరీ ఎక్కువ అవ్వడంతో చేసేదేం లేక షూటింగ్ ని ఆపేశారు.దీంతో కొన్ని రోజులు పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది.అయితే పుష్ప మొదటి భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ అంతా ప్లాన్ చేసుకున్నారు.

మరి ఈ లెక్కన షూటింగ్ రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూ ఉంటే షూటింగ్ ను ఎప్పుడు పూర్తి చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు. మరో పక్క ఈ షూటింగ్ త్వరగా పూర్తి చేసి 'ఐకాన్' ప్రాజెక్ట్ ను మొదలెట్టాలని ఇప్పటికే బన్నీ షెడ్యూల్స్ కూడా రెడీ చేసుకున్నాడు.ఇలాంటి సమయంలో పుష్ప షూటింగ్ కి బ్రేకులు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా కన్నడ బ్యూటీ రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: