ఆరుగురితో బ్రేక‌ప్‌.. ఏడో ప్రేమ మెద‌లు పెట్టిన హీరోయిన్ ?

VUYYURU SUBHASH
బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ గురించి అంద‌రికి తెలిసిందే. ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే.. !  తెలుగులో ఆమె కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో 2002లో వ‌చ్చిన ఖడ్గం సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  మగధీర సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు కూడా కిమ్ శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  ఇక ఇండియా స్టార్ క్రికెట‌ర్ యువరాజ్ సింగ్ గాళ్ ప్రెండ్ గా దేశం  మొత్తం పాపులర్ అయ్యేలా వార్త‌ల్లో నిలిచింది.
ఈ పాపులారిటీయే ఆమెకు మంచి ఛాన్సులు తెచ్చి పెట్టింది. ఇదిలా ఉంటే ఆమె ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా రొమాంటిక్‌. ఆమె చాలా మందితో ఎఫైర్లు పెట్టుకుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఆమె జీవితంలో ఏకంగా ఆరు ఎఫైర్లు ఉన్నాయి. ఇప్పుడే ఏడో ఎఫైర్ కూడా స్టార్ట్ చేసింద‌ట‌.  కిమ్ శర్మ జీవితంలో యువరాజ్ ఒక్కడే కాదు మొత్తం 7 గురు ఉన్నట్లు తెలుస్తోంది. యువ‌రాజ‌త్ తో బ్రేక‌ప్ త‌ర్వాత  స్పానిష్ సింగర్  కార్లోస్ మారిస్ తో కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసింది. త‌ర్వాత కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పుంజానీతో సహజీవనం చేసింది.
ఇద్దరు పెళ్లి కూడా చేసుకుని కెన్యాలో కాపురం చేసి విడిపోయారు. ఆ త‌ర్వాత ఇండియాకు వ‌చ్చి మ‌న తెలుగు న‌టుడు అయిన హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేసి మ‌ళ్లీ అత‌డితో కూడా విడిపోయింది. మ‌ళ్లీ బాలీవుడ్ డిజైనర్ అర్జున్ ఖన్నా ను ప‌ట్టి అత‌డితో డేట్ చేసింది. ఆ త‌ర్వాత హిందీ సినిమాల్లో పాపుల‌ర్ అయిన యువ న‌టుడు అమిత్ సద్ తో ప్రేమాయణం నడిపి మ‌ళ్లీ అత‌డి ని కూడా వ‌దిలేసింది. ఇక ఇప్పుడు లియాండ‌ర్ పేస్ ను ప‌ట్టేసి అత‌డి తో డేటింగ్ మొద‌లు పెట్టిన‌ట్టు ఆమె సోష‌ల్ మీడియాలో వ‌దులుతోన్న ఫోటోలే చెపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: