యువ హీరో సినిమాకి నో చెప్పిన అనుష్క..!?

N.ANJI
లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమా హీరో నవీన్ పొలిశెట్టి.. స్వీటీ అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిన విదితమే. ఇక 20 ఏళ్ల కుర్రాడు 40 ఏళ్ల యువతికి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ చిత్ర కథ అని.. కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైయినర్గా ఈ మూవీ తెరకెక్కబోతుందని వార్తలు కూడా వెలువడ్డాయి.
ఇక రారా కృష్ణయ్య ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడని.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం ఆగిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు స్వీటీ అనుష్క నో చెప్పారంట. దాంతో ఈ చిత్రానికి బ్రేక్ పడింది. ఇక సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోయింది. దాంతో  స్టార్ హీరోలతో అవకాశాలు తగ్గిపోయంట.
అయితే నవీన్ పొలిశెట్టి సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే జాతి రత్నాలు హిట్ కొట్టడంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో అనుష్కతో చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కోసం బరువు తగ్గాలని డైరెక్టర్ అనుష్కకు సూచించారంట. కాగా.. ఎంత ట్రై చేసినా అనుష్క బరువు తగ్గడం లేదని సమాచారం.
ఇక మరోవైపు సినిమా చేసేందుకు కూడా అనుష్కకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదంట. అంతేకాక..  ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారంట. ఇక అనుష్క ప్లేస్లో మరోనటిని పెట్టి.. సినిమాను లాగించేస్తారా? లేక ఆపేస్తారా? అన్న విషయంపై క్లారిటీ లేదని చెప్పాలి. ఇక ఇదే విషయంపై పలువురు నెటిజన్లు నవీన్ పొలిశెట్టిని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అంతేకాదు.. ఆయన తాను ఈ విషయంపై త్వరలోనే చెబుతునంటూ పేర్కొన్నారు. అయితే మొత్తానికి ఈ చిత్రానికి బ్రేకులు పడినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: