అప్పుడు తారక్ కోసం.. ఇప్పుడు ప్రభాస్ కోసం ఆ పని చేస్తున్న కాజల్

Mamatha Reddy
లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ కాజల్. ఆ సినిమా తర్వాత చందమామ సినిమా తో ఆమెకు గుర్తింపు రాగ మగధీర సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని కాజల్ ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ప్రతి ఒక్క హీరోతో రెండేసి మూడేసి సినిమాలు చేసిన కాజల్ అంటే అందరికీ ఎంత అభిమానమో దీని ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం పెళ్లి తర్వాత కూడా ఈమె వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగార్జున హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఇవేకాకుండా ఈమె ఇప్పుడు వెబ్ సిరీస్ లను చేయడం కూడా మొదలు పెట్టింది. ఇటీవలే ఓ హర్రర్ వెబ్ సిరీస్ లో నటించిన ఈమె తొలి వెబ్ సిరీస్ తోనే హిట్ కొట్టి మరిన్ని వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌత్ లో అన్ని భాషల్లో నటించి కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ గ్లామర్ డాల్ హిందీలో కూడా పలు సినిమాలు చేసి పాన్  ఇండియా హీరోయిన్ గా అవతరించింది.

ఇకపోతే ఈమె ప్రభాస్ తో రెండు సినిమాలలో నటించగా ఇప్పుడు మూడోసారి తెర పంచుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలో వీరిద్దరూ సందడి చేయగా దాదాపు పదేళ్ల తర్వాత ఆమె ప్రభాస్ తో నటిస్తుండడం విశేషం. ప్రభాస్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో చిందేయడానకి ఒప్పుకుందట. ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతాగ్యారేజ్ లో స్పెషల్ సాంగ్ చేసిన కాజల్ ఈ భారీ యాక్షన్ మూవీ లో కూడా స్పెషల్ సాంగ్ చేయబోతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుండగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: