ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన సినిమాలు

Mamatha Reddy
టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ఇంకా ఎన్నో సినిమాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాయి. ఒక్కో వర్గం ప్రేక్షకులకు ఒక్కో విధంగా దర్శకులు సినిమాలను తీసి అలరించగా సెంటిమెంటల్ సినిమాలను సైతం తెరకెక్కించి ఆ తరహా ప్రేక్షకులను అలరించారు. కన్నీరు పెట్టించే సినిమాలను తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకులు పండిపోయారు.  నటీనటులు కూడా ఆ తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల సింపతి కొట్టేశారు. వారిదైన డైరెక్షన్ తో దర్శకులు మంచి మంచి సినిమాలను సెంటిమెంట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులచే కన్నీరు పెట్టించారు.

తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసి వారితో కన్నీరు పెట్టించారు చాలామంది నటీనటులు.  అలాంటి  నటీనటులు ఎవరూ ఇప్పుడు చూద్దాం. ప్రేక్షకులను నాని ఆయన నటించిన భీమిలి కబడ్డీ జట్టు జెర్సీ సినిమాల ద్వారా కన్నీళ్లు పెట్టించారు. కబడ్డీ కోసం ప్రాణాలు వదిలిన సినిమా ఒకటైతే, క్రికెట్ కోసం ప్రాణాలు వదిలిన సినిమా మరొకటి. ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులతో  కంటతడి పెట్టించారు నాని. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండవ పార్ట్ లో ప్రభాస్ మరణం సినీ ప్రేక్షకులను ఎంతగానో కంటతడి పెట్టించింది.

సాయికుమార్ జగపతి బాబు సౌందర్య జంటగా నటించిన అంతపురం సినిమా లో సాయికుమార్ మరణం తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టించిం ది. రానా హీరోగా కాజల్ అగర్వా ల్ , క్యాథరిన్ లు నటించి న నేనే రాజు నేనే మంత్రి క్లైమాక్స్  లో రానా మరణించడం, కాజల్ అగర్వాల్ మరణం ప్రేక్షకులను ఎంతగానో బాధించింది. శ్రీకాంత్ హీరోగా చేసిన ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే చనిపోయిన సీన్ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చర ణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి చనిపోయే ఎపిసోడ్ చాలా బాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: