ముంబై కి మకాం మార్చిన నేషనల్ క్రష్.. !

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే కొండంత కష్టంతో పాటు గోరంత లక్కు కూడా ఉండాలని అంటుంటారు. అలా ల‌క్కు తోక తొక్కిన భామ రష్మిక మందన. మొదట కన్నడ సినిమా కిరిక్ పార్టీ తో రష్మిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంది. అనంతరం ఛ‌లో సినిమాతో ర‌ష్మిక టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా కూడా హిట్ అవడంతో ఆ వెంటనే యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కు జోడిగా గీత గోవిందం సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

ఆ తర్వాత బ్యూటీకి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా వ‌రుస‌ అవకాశాలు దక్కించుకుంటూ ర‌ష్మిక స్టార్ హీరో హీరోయిన్ రేంజ్ కు ఎద‌గ‌ట‌మే కాకుండా నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ర‌ష్మిక ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించ‌బోతుంద‌ట‌. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌ల చేసిన పోస్ట‌ర్ల‌లో ర‌ష్మిక లుక్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా పలు క్రేజీ ఆఫర్లు రష్మిక ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ట‌.

ఇది ఇలా ఉండగా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న‌ సంగతి తెలిసిందే. అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న మిషన్ మజ్ను అనే సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో అవకాశం రావడంతో ర‌ష్మిక ఇప్పటికే అక్కడ ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే తాజాగా రష్మిక ఆ ఫ్లాట్ కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ముంబై లో ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయ‌ని దాంతో అవకాశాలు వస్తాయని రష్మిక ముంబైకి మకాం మార్చిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా గ‌న‌క హిట్ అయితే నేష‌న‌ల్ క్ర‌ష్ బాలీవుడ్ ను సైతం షేక్ చేయ‌డం కాయ‌మేన‌ని ఆమె అభిమానులు చెబుతున్నారు. మ‌రి అక్క‌డ కూడా ల‌క్ ప‌నిచేస్తుందా? లేదా.? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: