తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణికి సినిమాల్లో అవకాశాలు తగ్గాయి.అయితే తనకు మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం తన అందాలను ఆరబోయడానికి సైతం వెనుకాడటంలేదు.మంచిగ్లామరస్గా కనిపించే ప్రియమణికి మొదట్లో మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లైన కొత్తలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి...ఆ తరువాత రాజమౌళి తీసిన యమదొంగతో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో కొత్తతరం హీరోయిన్ల ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కేరళకుట్టీకి అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో ఆమె తన అందన్ని మరింత పెంచుతూ ఎలాంటి పాత్రల్లోనైనా నటించాలని నిర్ణయించింది.సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరిస్ల్లో సైతం నటిస్తుంది ఈ కేరళ కుట్టి . 2009లో విడుదలైన ద్రోణ చిత్రంలో ప్రియమణి బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్ల మతిపొగొట్టింది. ఆమె అప్పట్లో అలా బికినీలో కనిపించడం ఓ సంచలనమనే చెప్పాలి.ఇప్పుడు అదే బికినీ కామన్గా మారిపోయింది.
కె.కరుణ్కుమార్ దర్శకత్వంలో వచ్చిన ద్రోణ సినిమాలో నితిన్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా నటించారు.. 2009లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి నిర్మాతగా దమ్మాలపాటి శ్రీనివాసరావు వ్యవహరించారు. అప్పట్లో బికినీ వేయడానికి గాను ప్రియమణి ఆయన దగ్గర భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి తీసుకుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.ఆ రూమర్స్ని నిర్మాత కొట్టిపారేశారు. బికిని వేయమన్నప్పుడు ప్రియమణి ఐదు నిమిషాలు మాత్రమే ఆలోచించి బికినీ వేస్తానని ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా సినిమా కథ చెప్పేటప్పుడే వీటిని చెప్పకుండా మధ్యలో చేప్తే కొంతమంది హీరోయిన్లు రిజెక్ట్ చేస్తారు కానీ ప్రియమణి మాత్రం ఎలాంటి కండీషన్లు లేకుండానే ఒప్పుకుంది. సినిమా మీద క్రేజ్ తీసుకురావడానికి దర్శకుడు ఇలా బికినీ ధరింపచేశారు అని దర్శకుడి కోరిక మేరకు పాట మొత్తం బికినీ వేసుకుని ప్రియమణి కనిపించిందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నారప్ప,విరాటపర్వం చిత్రాల్లో ప్రియమణి నటించింది.