రాజమౌళిపై దిల్ రాజు అలా రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

Deekshitha Reddy
రాజమౌళితో సినిమాలు చేయాలని చాలామంది నిర్మాతలకు కల. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కేవలం డబ్బులు కుమ్మరించేవారినే కాదు, సినిమాపై ప్యాషన్ ఉన్నవారితోనే తాను సినిమాలు చేస్తానంటూ గతంలోనే ప్రకటించారు రాజమౌళి. అందుకే సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ఇప్పటి వరకూ రాజమౌళికి కాంబినేషన్ కుదరలేదు. దిల్ రాజు చాలాసార్లు ప్రయత్నించినా రాజమౌళితో మాత్రం ఆయన సినిమా చేయలేకపోయారు.
రాజమౌళి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోవడంతో ఇప్పుడాయన్ని అందుకోవడం మరీ కష్టం. అయితే దిల్ రాజు అనుకుంటే అదేమంత పెద్ద విషయం కాకపోయినా.. ఇద్దరికీ ఎందుకో సెట్ కావడం లేదు. ఈ క్రమంలో రాజమౌళి లేకుండానే పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేందుకు దిల్ రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాలీవుడ్ నిర్మాతలతో చేతులు కలుపుతున్నారు. అంతే కాదు.. టాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా సినిమాలు తీసే దర్శకులను ఎంపిక చేసుకుని మరీ వారితో సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాకు దిల్ రాజు బ్యాక్ ఎండ్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ గాసిప్ గానే ఉన్న ఈ విషయాన్ని ఇటీవలే గుణశేఖర్ కూడా ధృవీకరించారు. శాకుంతలం సినిమాకు తన కుమార్తె నీలిమ నిర్మాత అయినా.. ఆర్థిక సహకారం దిల్ రాజు అందిస్తున్నారని, ఆయన సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు. ఒకరకంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో రాజమౌళి ని కాదని దిల్ రాజు గుణశేఖర్ ని ప్రోత్సహిస్తున్నారు. రాజమౌళితో సినిమా తీసే అవకాశం రాకపోవడంతో ఇప్పుడు గుణశేఖర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. శాకుంతలం రిజల్ట్ బాగుంటే గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ హిరణ్యకశిప పట్టాలెక్కించేందుకు కూడా దిల్ రాజు సహాయం చేస్తారని సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తోవచ్చే హిరణ్యకశిప సినిమాని ప్రస్తుతానికి పక్కనపెట్టారు గుణశేఖర్. అన్నీ కుదిరితే, పెద్ద నిర్మాతలు దొరికితే, ఈ సిినిమా కూడా మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: