ఎస్వీ కృష్ణారెడ్డిని చూసి గజగజ వణికిపోయిన బాలయ్య.?

Suma Kallamadi
నందమూరి బాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డిల మధ్య చోటు చేసుకున్న ఒక సంఘటన అప్పట్లో యావత్ టాలీవుడ్ పరిశ్రమను ఆశ్చర్య పరిచింది. ఎస్వీ కృష్ణారెడ్డి చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పరు. ఎంతో నిజాయితీగా ఉండే కృష్ణారెడ్డి ఏదైనా తేడా వస్తే మాత్రం తన ఉగ్రరూపం చూపిస్తారు. అందుకే ఆయనతో సినిమా చేసే నటీనటులు చాలా జాగ్రత్తగా ఉంటారు. దివంగత నటీమణి సౌందర్య కూడా కృష్ణా రెడ్డి గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకు ఎంతో గౌరవం ఇస్తుండేవారు. అలీతో, మోహన్ బాబుతో కలిసి నాట్యం చేయడానికి కూడా కృష్ణా రెడ్డి పైన ఆమెకున్న గౌరవమే అని చెప్పుకోవచ్చు.

అయితే అప్పట్లో కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన టాప్ హీరో సినిమాలో కథానాయకుడిగా బాలకృష్ణ నటించారు. ఈ సినిమా సెట్స్ లోనే బాలకృష్ణ, కృష్ణారెడ్డిల మధ్య ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే టాప్ హీరో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షాట్ బ్రేక్ లో సెట్స్ లో యూనిట్ సభ్యులతో కలిసి బాలకృష్ణ పేకాట ఆడటం ప్రారంభించారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కృష్ణారెడ్డి ని చూసి బాలకృష్ణ ఠక్కున లేచి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారట. బాలకృష్ణ లేచి నిలబడటం చూసిన కృష్ణారెడ్డి "అయ్యో ఎందుకు నిల్చున్నారు. కూర్చోండి" అని అన్నారట. "నేను పేకాట ఆడుతూ మీకు కనిపించి పెద్ద తప్పు చేశాను. మీరు గొప్ప డైరెక్టర్.. మీ ముందు ఇలా చేయడం తప్పు అనిపించింది. అందుకే చేతులు కట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను" అని అన్నారట.



నిజానికి బాలకృష్ణ అందరినీ గడగడలాడిస్తారు. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి పట్ల ఆయన ఎంతో భయం భక్తి కలిగి ఉంటారు. అందుకే ఆరోజు చేతులు కట్టుకుని మరీ ఎస్వీ కృష్ణారెడ్డి కి క్షమాపణలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: