కరోనా తర్వాత మొదటి సారి అలా కనిపించిన తారక్

Mamatha Reddy
ప్రస్తుతం కరోనా ప్రతి ఒక్కరిని ఎంతలా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. పెద్ద పెద్ద వారు సైతం ఈ మహమ్మారికి భయపడి ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. డాక్టర్లు సైతం ఎంతో జాగ్రత్తగా తమ తమ పనులను చూసుకుంటుండగా సామాన్యులు అయితే ఈ మహమ్మారిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. టాలీవుడ్ లో కూడా చాలామంది సెలబ్రిటీలకు ఈ మహమ్మారి సొకగా వారు తో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో లో తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలియజేయగా ఎన్టీఆర్ అభిమానులను ఈ వార్త తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ విషెస్ తెలియజేశారు. అలాగే తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేశారు.కరోనా సోకిన వెంటనే క్వారంటైన్ అయిన ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. దాదాపు రెండు వారాల చికిత్స తర్వాత ఎన్టీఆర్ కోలుకున్నారు తనకు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఫ్యాన్స్ కి తెలియజేశారు. దాదాపు రెండు వారాల తర్వాత ఎన్టీఆర్ దేవాలయానికి వెళ్ళగా అక్కడ అర్చకుడి తో ఫోటో దిగారు.
ట్రెడిషనల్ వేర్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోని చూశామని ఆయనని ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకొని ఇలా కనిపించడం సామాన్యులకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని చిత్రాల షూటింగ్ తో పాటు ఈ సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ పడింది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లో రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: