ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

Divya

ప్రియమణి మొట్టమొదట సినీ ఇండస్ట్రీలోకి, అందులోనూ తెలుగు ప్రేక్షకులకు " ఎవరే అతగాడు" చిత్రం ద్వారా పరిచయమైంది. ఇక ఆ తర్వాత జగపతిబాబు సరసన "పెళ్లయిన కొత్తలో " చిత్రం  ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక వెంటనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించి, మంచి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అలాగే కేవలం అనతి కాలంలోనే మంచి సక్సెస్ ను అందుకున్న ప్రియమణి, ఆ తర్వాత కొన్నాళ్ళ వరకు ఈమె ప్రయాణం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగానే జరిగింది.
తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. అయితే కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం తో ఈమెకు సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు కోసం ఎదురు చూస్తూ, తిరిగి కన్నడ, మలయాళ ఇండస్ట్రీల వైపు మళ్ళింది. ఇక అక్కడ కూడా బాగానే రాణించింది. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమకు దూరమైనా, బుల్లితెరకు దగ్గర అయి, ఢీ ప్రోగ్రాం ద్వారా మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఢీ షో లో జడ్జిగా వ్యవహరిస్తూ, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే తిరిగి సినీ ఇండస్ట్రీలోని అవకాశాలు మళ్లీ పలకరించడంతో, తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ప్రస్తుతం ఈమె వెంకటేష్ నటిస్తున్న " నారప్ప" సినిమాల్లో నటిస్తోంది. అలాగే "విరాటపర్వం " సినిమాలో  కూడా నటిస్తోంది. ఇక విరాటపర్వం సినిమాలో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న  సమయంలో వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురు చూసిందట..
ఇక ప్రియమణి మాట్లాడుతూ.. వెంకటేష్ గారితో నటించాలనే కోరిక నాకు చాలా కాలం నుండి ఉంది. అప్పట్లో ఆయన సరసన నటించే అవకాశాలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యేవి. ఇక ఇంత కాలానికి నా ఎదురు చూపులు ఫలించాయి. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. నారప్ప లో నేను చేసిన పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది. " అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: