ఎన్టీఆర్ 31 మూవీ కి .... రాక్ స్టార్ ఫిక్స్.... .??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని అందుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా మెగానందమూరి హీరోలు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా ఈ సినిమా పై హైప్ ఏర్పడింది. రాజమౌళి తీస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తుండగా ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకోగా కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా కొనసాగుతుండడంతో ఈ మూవీ షూట్ ని ఇటీవల నిలిపివేశారు. ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఈ మూవీకి థమన్ లేదా అనిరుద్ లలో ఎవరో ఒకరు మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈ మూవీని జులై లో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మితం కానున్న సినిమాని ఎన్టీఆర్ చేయనున్నారు. ఎంతో భారీ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఈ సినిమా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దేవి అయితే ఈ భారీ మూవీ కి పక్కాగా మ్యూజిక్, బీజీఎమ్ అందించగలరు అని భావించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లు ఇటీవల అతడిని తీసుకోవడానికి నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ వార్త పై అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: