ఎన్టీఆర్ 31 మూవీ కి .... రాక్ స్టార్ ఫిక్స్.... .??
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకోగా కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా కొనసాగుతుండడంతో ఈ మూవీ షూట్ ని ఇటీవల నిలిపివేశారు. ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఈ మూవీకి థమన్ లేదా అనిరుద్ లలో ఎవరో ఒకరు మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈ మూవీని జులై లో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మితం కానున్న సినిమాని ఎన్టీఆర్ చేయనున్నారు. ఎంతో భారీ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఈ సినిమా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దేవి అయితే ఈ భారీ మూవీ కి పక్కాగా మ్యూజిక్, బీజీఎమ్ అందించగలరు అని భావించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లు ఇటీవల అతడిని తీసుకోవడానికి నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ వార్త పై అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది ....!!