వెంకీతో ప్రియమణి మూవీ చేయడం వెనక... ?

Satya
ప్రియమణి జాతీయ అవార్డు విన్నర్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె అద్భుతమైన నటీమణి. ఆమె బిగినింగ్ డేస్ లో సినిమాలు ఫ్లాప్ అవడంతో అనుకున్నంతగా కెరీర్ ముందుకు సాగలేదు. లేకపోతే అగ్ర‌ నటిగా కొన్నాళ్ళు ఇండస్ట్రీని ఏలేసే హీరోయినే మరి.
ఆమె కోలీవుడ్ లో చేసిన   పరుత్తి వీరన్ సినిమాలో నటనకు జాతీయ అవార్డు సాధించింది అంటే ప్రియమణిని ఎవరైనా తక్కువ అంచనా వేయగలరా. అయితే టాలీవుడ్ లో గ్లామర్ కి పెద్ద పీట వేస్తారు. ప్రియమణికి గ్లామర్ కంటే కూడా గ్రామర్ ఎక్కువగా ఉంది. అందువల్ల కూడా ఆమెకు ఆఫర్స్ రాకపోయి ఉండవచ్చు అన్న మాట కూడా ఉంది.  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద మెగాస్టార్ చిరంజీవితో అనేకమైన సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు తన కుమారుడు వల్లభను హీరోగా పరిచయం చేస్తూ ఎవరే అతగాడు అన్న టైటిల్ తో ఒక మూవీ తీశారు. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ప్రియమణి మీద నెగిటివ్ ముద్ర పడిపోయింది.
ఇదిలా ఉంటే జగపతిబాబు హీరోగా పెళ్లైన కొత్తలో మూవీతో ఆమె మళ్లీ హిట్ కొట్టి వరసపెట్టి సినిమా చేసింది. ఇక బాలయ్యతో మిత్రుడు చేస్తే నాగార్జునతో రగడ మూవీ చేసింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అగ్ర నటుల పక్కన చాన్సులు రాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో వెంకటేష్ తో ఆమెకు చాన్స్ వచ్చింది. అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ వంటి బ్యానర్ మీద నిర్మించే చిత్రం. నారప్పలో వెంకీ పక్కన చాన్స్ అనగానే రెండవ మాట లేకుండా ప్రియమణి ఒప్పుకుందిట. ఈ మూవీ గ్యారంటీ హిట్ అంటున్నారు. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ తరువాత టాలీవుడ్ లో తాను బిజీ అవుతాను అని ప్రియమణి భావిస్తోందిట. అసలే సీనియర్లకు హీరోయిన్ల కరవు ఉంది. ఇపుడు ప్రియమణి ఎంట్రీతో ఆ కొరత తీరుతుంది అంటున్నారు. మొత్తానికి రైట్ డెసిషన్ తీసుకుంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: