అల్లు శిరీష్ కొత్త సినిమాపై ట్రోలింగ్స్...
అల్లు అరవింద్ కూడా శిరీష్ పై పెద్దగా దృష్టి పెడుతున్నట్లు లేదు. ఆయన తలచుకుంటే కొడుకు కోసం సరైన డైరెక్టర్ ని తీసుకొచ్చి హిట్ తీసుకురాగలడు.కానీ మార్కెటింగ్ లెక్కలు అన్నీ చూసుకొని పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేడు. ఆ విషయం పక్కన పెడితే.. 'విజేత', 'జత కలిసే' అనే రెండు ప్లాప్ సినిమాలను రూపొందించిన రాకేష్ శశి అనే డైరెక్టర్ చేతిలో సినిమా పెట్టడం ఆశ్చర్యంగా మారింది.తమిళంలో సక్సెస్ అయిన 'ప్యార్.. ప్రేమ.. కాదల్' అనే సినిమాకు రీమేక్ గా 'ప్రేమ కాదంట' సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో సినిమా మంచి సక్సెస్ అందుకుంది. యూత్ ఫుల్ సినిమా కావడం.. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ల రొమాన్స్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో తెలుగులో కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడు మాత్రమే. విజయ్ అనే వ్యక్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అయితే అంత బాగానే వుంది కాని ఈ సినిమాకి ఇప్పట్నుంచే ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా నుంచి వచ్చిన ఫోటోలలో ఒక ఫోటో వుంది అది శిరీష్, అను ఇమాన్యుయేల్ అద్దంలో చూసుకుంటూ సెల్ఫీ దిగిన ఫోటో.
ఆ ఫోటో ఇటీవల వివాదాస్పదమైన టిక్ టాక్ స్టార్ నవీన్ తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోని పోలి ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల నవీన్ తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఓ ఫోటో ఒకటి లీకయ్యి పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ఫోటోతో ఈ ఫోటోని కంపెర్ చేస్తూ కొంపదీసి శిరీష్ నవీన్ బయోపిక్ చెయ్యట్లేదుగా అని నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.