తారక్ తనయుడికి అక్షరాభ్యాసం వేడుకలు..?

Suma Kallamadi
భారతీయ తల్లిదండ్రులు ఓ పవిత్రమైన రోజు చూసుకొని తమ పిల్లల చేత దేవాలయంలో గాని, పాఠశాలలో గాని, లేదా పండితుల సమక్షంలో గాని అక్షరాలు దిద్దిస్తారు. అక్షరాభ్యాసం రోజు విద్యాధిదేవతలను శ్రద్దగా పూజించి పిల్లల చేత అక్షరాలు దిద్దించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక పళ్ళెం లో బియ్యం పోసి దానిని మూడు భాగాలుగా విభజించి ఒక్కో భాగంలో "ఓం నమః", "శివాయః", "సిద్ధం నమః" అక్షరాలను దిద్దించడంతో పిల్లలకు చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ కి అక్షరాభ్యాసం వేడుకలు జరిపించారు. ఆయన ఒక దేవాలయంలో పండితుల సమక్షంలో తన కుమారుడికి అక్షరాభ్యాసం వేడుకలు జరిపించినట్టు తెలుస్తోంది.

అయితే తారక్ పండితుల వారితో కలసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీడియాకి చాలా దూరంగా తన కుమారులను ఉంచాలని.. తన స్టార్డం వారిపై ఎటువంటి నెగిటివ్ ప్రభావం చూపకూడదని తారక్ చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకే ఆయన కుమారులకు సంబంధించిన ఫొటోలు గాని, వీడియోలు గానీ ఎక్కువగా బయటికి రావు. ఇప్పుడు కూడా అక్షరాభ్యాసం వేడుకలకు సంబంధించిన సమాచారం తెలిసింది కానీ ఫోటోలు మాత్రం బయటకు రాలేదు.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలను చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని తపన పడుతున్నట్టు పలు సందర్భాల్లో స్పష్టమయింది. ఏదో ఒక రోజు తన పిల్లలు ఏదో ఒక రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటే.. తన సంతోషాలకి అవధులు ఉండవని.. వారు గొప్పవారు అవుతారనే నమ్మకం తనకుందని ఆయన ఒక సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. తారక్ రాజమౌళి తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. అనంతరం కొరటాల శివతో కలిసి తన తదుపరి చిత్రం చేయనున్నారు. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించనున్నారని సమాచారం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా నటించనున్నారని కూడా తెలుస్తోంది. జూ. ఎన్టీఆర్ ఇప్పటివరకు పొలిటికల్ లీడర్ గా నటించిన దాఖలాలు లేవు. కానీ అతన్ని నిజ జీవితం లోనే పొలిటీషియన్ గా చూడాలని అభిమానులు బాగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల్లో పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: