పవన్ హెచ్చరికలతో అలెర్ట్ అయిన హరిహర వీరమల్లు యూనిట్ !
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ‘హరిహర వీర మల్లు’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రస్థుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తరువాత ఈ మూవీ పై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.
పవర్ స్టార్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ చరిత్ర నేపధ్యంలో తీయబడుతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏయం. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కరోనా బారినుండి కోలుకోని షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇవ్వడంతో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సద్దుబాటు అయ్యాక ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్ట బోతున్నట్లు నిర్మాత ఏ.ఎం రత్నం మీడియాతో ఇటీవలే తెలిపాడు.
అయితే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి పవన్ ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సెట్ లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా అలాగే సెట్ లోకి వచ్చే ఏ ఒక్కరిని కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం నిర్మాత భాద్యత అని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. మొఘల్ కాలంనాటి సామ్రాజ్యంలో వీరమల్లు అనే బందిపోటు కథతో తీస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమా తరహాలో ఉంటుంది.
రాబిన్ హుడ్ లాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ ధనికులను దోచి పేదలకు పంచే పాత్రలో కనిపించబోతున్నాడు. పీరియడిక్ చిత్రం కావడంతో భారీ సెట్లను ఆకాలంనాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాల నుండి లీకులు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీ కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని క్రిష్ ఈ సినిమా విషయంలో విపరీతమైన శ్రద్ధను తీసుకుంటున్నాడు..