బాలయ్య మూవీ లో మరొకసారి విలన్ గా ఆయనే .... ??

GVK Writings
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండటంతో మిగతా సినిమాలతో పాటు ఈ మూవీ షూటింగ్ ని కూడా నిలుపుదల చేశారు. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీనిని ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ నెల 28న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగానే కొన్నాళ్ళ పాటు వాయిదా వేశారు.
ఇక ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని తో బాలయ్య ఒక మూవీ చేయనున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో బాలయ్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని జూలైలో పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబు నటించిన ఉన్నారని, ఇటీవల జగపతి బాబు ని ఆయన నివాసంలో కలిసి కథ, కథనాలు వినిపించిన దర్సకుడు గోపీచంద్, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాల్షీట్స్ కూడా తీసుకున్నారట.
గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన లెజెండ్ మూవీ లో కూడా జగపతిబాబు విలన్ గా నటించారు, కాగా ఆ మూవీ సూపర్ హిట్ అయింది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీని పై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. కాగా ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ జూన్ 10న బాలయ్య జన్మదినం రోజు రానుందని అంటున్నారు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: