"అల్లు అర్జున్ కళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటాయి".. ఐకాన్ స్టార్ పై హాట్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
బుల్లితెరపై టాప్ ఫిమేల్ యాంకర్స్ లో ముందు వరుసలో ఉంటుంది అనసూయ. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకొని.. ఆడియన్స్ లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ. ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు..ఇంకో వైపు సోషల్ మీడియాలో ఇలా నిత్యం బిజీ బిజీగా గడుపుతోంది ఈ హాట్ యాంకర్.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో టచ్ లో ఉండే అనసూయ.. అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.

ఆమె ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ కు స్టన్ అయ్యిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమా లాగే చేస్తాడు. నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా గమనించాను. అర్జునుడు చెట్టు మీద వున్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్లుగా. బన్నీ కళ్ళు కూడా ఎప్పుడూ చెప్పిన పాయింట్ మీదే ఉంటాయని అనసూయ తెలిపింది. కాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న’పుష్ప’ నుంచి బన్నీ పుట్టినరోజును పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్.

ఇప్పటికీ ఈ వీడియో ‘తెగ్గేదే లే’ అంటూ ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా. రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదల చేయడం కష్టం అని భావించి.. సినిమా రిలీజ్ ని వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: