రోజా వద్దు ఇంద్రజే ముద్దు..

MADDIBOINA AJAY KUMAR
.బుల్లితెరపై నవ్వుల పూవులు పూయించి సూపర్ హిట్ గా నిలిచిన కామెడీ షో జబర్ధస్త్. 2013 లో ప్రారంభమైన ఈ కామెడీ షో ఇప్పటికీ కోనసాగుతుందంటే ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ షో ప్రారంభం నుండి రోజా , నాగబాబు జడ్జ్ లుగా వ్యవహరించగా ఇటీవలే నాగబాబు షో నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన వేరే షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక జబర్ధస్త్ లో కంటెస్టెంట్ లకు ఎంతమంది అభిమానులు ఉన్నారో. అదే రేంజ్ లో నాగబాబు రోజాలకు కూడా ఉన్నారు. నాగబాబు షో నుండి వెళ్లిపోయినా రోజా మాత్రం జబర్ధస్త్ లోనే కొనసాగుతూ వచ్చింది.  అయితే రోజా అనారోగ్యం భారినపడటంతో ఇటీవల రెండు సర్జరీలు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి రాజకీయాలతో పాటు టీవీషోలకు రోజా దూరంగా ఉంటోంది.
దాంతో రోజా దాదాపు ఆరు వారాలుగా షోకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జడ్జ్ గా వ్యవహరించేందుకు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ను జడ్జ్ గా నియమించారు. ఇక ఇప్పటి వరకు చాలా మంది జబర్ధస్త్ లో జడ్జ్ స్థానంలో కూర్చున్నారు కానీ ఇంద్రజకు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె అమాయకత్వం...జోకులు పేలినప్పుడు ఆమె నవ్వే విధానం జబర్ధస్త్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇంద్రజ నవ్వు కోసమైనా షో చూడవచ్చని ప్రేక్షకులు అంటున్నారు. అయితే తాజాగా వచ్చిన జబర్ధస్త్ ప్రోమోలో రోజా ఎంట్రీ ఇచ్చింది. ఇక చాలా రోజుల తవరవత రోజాను చూసిన అభిమానులు మాకు రోజా వద్దు ఇంద్రజే కావాలని అంటున్నారు. మరి కొందరు ఇంద్రజ లేకుంటే మేము షోను చూడము అంటూ తెగేసి చెబుతున్నారు.ప్రేక్షకుల డిమాండ్ మేరకు నిర్వాహకులు ఇప్పుడు రోజా తో పాటు ఇంద్రజను కూడా జడ్జ్ గా కొనసాగిస్తారా..లేదంటే ఇద్దరిలో ఒకరిని జడ్జ్ స్థానంలో కూర్చోబెడతారా అన్నది ఆసక్తిగా మారింది. మరి జబర్ధస్త్ మేకర్స్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: