బాణీలతో సినిమా పాటలకు వోణీలు వేసిన వేటూరి.. !
సాంప్రదాయ కవిత్వం నుండి జానపద గేయాలవరకు అన్ని రకాల పాటలతోనూ వేటూరి ఆకట్టుకున్నారు. మాతృదేవోభవ సినిమాలో వేటూరి రాసిన "రాలిపోయె పువ్వానీకు రాగాలేందుకే" పాటకు 1994 సంవత్సరం లో అవార్డు వచ్చింది. ఇదే తెలుగు పాటకు రెండవసారి జాతీయ అవార్డు రావడం. కాగా తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వలేదన్న కారణంతో వేటూరి తన అవార్డును తిరిగిచ్చి మాతృ భాష పై తనకున్న అభిమానం, ప్రేమను చాటిచెప్పారు. 1936లో కృష్ణా జిల్లాలో జన్మించిన వేటూరి 2010 మే22న మరణించారు. ఈరోజు వేటూరి వర్దంది సందర్భంగా ఆయన రాసిన కొన్ని సూపర్ హిట్ పాటలను ఇప్పుడు చూద్దాం...పదహారేళ్ళ వయసు సినిమాలోని "సిరిమల్లె పూవా సినిమల్లే పూవా", సీతా మహాలక్షి సినిమాలోని "సీతాలు సింగారం", అనురాగ దేవత చిత్రంలో "చూసుకో పదిలంగా" తో పాటు మరి కొన్ని సూపర్ హిట్ పాటలను రాసారు .