పాన్ ఇండియా క్రేజ్.. ప్రభాస్ కి ఆ సంతోషాన్ని దూరం చేసిందే?
ఇక బాహుబలి సినిమా తర్వాత మాత్రం ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు సైతం దక్కని అదిరిపోయే ఆఫర్లు సైతం దక్కించుకున్నాడు ప్రభాస్. సాధారణంగా ఇక స్టార్ హీరోలు ఏదైనా ప్రాంతానికి వచ్చారు అంటే ఇక ఆ ప్రాంతంలో అభిమానులు ఆ స్టార్ హీరో అని చూడటానికి ఎంతలా తరలివస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటిది పాన్ ఇండియా స్టార్ అంటే ఇక హడావిడి ఇంకెంత రేంజిలో ఉంటుంది.
ప్రస్తుతం ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ క్రేజ్ కాస్త ఏకంగా ఒక ఇష్టాన్ని దూరం చేసుకునేందుకు కారణం అయింది అన్నది అర్ధమవుతుంది. ప్రభాస్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాడు. అయితే ఇక చిన్నప్పటి నుంచి భీమవరం లాంటి ప్రాంతాల్లో పెరిగిన వాడే. అయితే పశ్చిమగోదావరి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కోళ్ల పందాలు. కోళ్ల పందాలను చూడటానికి పందాలు వేయడానికి కూడా ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడే వాడట. కానీ 2010లో ఇక తన తండ్రి మరణించిన తర్వాత కోళ్ళ పందేలకు వెళ్లడం మానేసాడట ప్రభాస్. కానీ ఇప్పుడు వెళ్లాలి అని అనుకున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం వద్దు అని చెబుతున్నారట. దీనికి కారణం ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం. ప్రభాస్ రావడం వల్ల ఎంతో సెక్యూరిటీ పోలీసులు కూడా వస్తారని అంతేకాకుండా అభిమానులతో గందరగోళ పరిస్థితి నెలకొంటుందని అలాంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే భయంతో ప్రభాస్ ను రావద్దు అని చెబుతారట స్థానిక ప్రజాప్రతినిధులు. ఇలా పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ప్రభాస్ కి చిన్న ఇష్టాన్ని దూరం చేసింది.