హీరో శింబు మిస్ చేసుకున్న ఈ ఐదు సినిమాలు ఏంటో తెలుసా..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లో కొద్దో గొప్పో పేరున్న హీరోలలో ఒకరు శింబు.. నయనతార తో ప్రేమ వ్యవహారంలో అప్పుడే ఇప్పుడో శింబు పేరు టాలీవుడ్ లో కూడా వినపడుతుంది..అంతేకాకుండా కొన్ని టాలీవుడ్ సినిమాలను కోలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ లు సంపాదిస్తూ ఉంటాడు.. అయితే గత కొన్ని సినిమాలుగా అయన కెరీర్ గతి తప్పి పోయింది అని చెప్పొచ్చు.. ఎందుకో తెలీదు కానీ అయన సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా బాగాలేదు.. మొదట్లో వరుస హిట్ లతో సూపర్ సక్సెస్ అందుకున్న శింబు ఇప్పుడు చాలా డల్ అయ్యారు..
దానికి కారణం అయన ప్రవర్తన అని అంటున్నారు.. అలా తన ప్రవర్తనతోనే చాలా మంచి సినిమాలను కోల్పోయారట.. కొణతమంది నయన్ తో ప్రేమ విఫలం అవడం వల్లనే శింబు కోలుకోలేకపోయాడని అందుకే సినిమా లపై ఇంట్రెస్ట్ తగ్గిందని అన్నారు.. ఏదేమైనా శింబు లాంటి హీరో ఇలా సైలెంట్ అవడం అయన అభిమానులకు నచ్చడం లేదు.. కొంచెం జాగ్రత్తగా ఉంది ఉంటే శింబు ఇప్పడు తమిళనాట స్టార్ హీరోగా ఉండేవాడు అంటున్నారు. ఇక శింబు మిస్ చేసుకున్న ఐదు హిట్ చిత్రాలను ఇప్పుడు చూద్దాం..
జీవా హీరో గా వచ్చిన రంగం సినిమా శింబు చేయాల్సింది కాగా తమన్నా కోసం ఆ సినిమా ని వదులుకున్నాడు శింబు.. అలాగే ధనుష్ నటించిన వడచెన్నై సినిమా కూడా  శింబు చేయాల్సిన సినిమానేనట.. ఆర్య, మాధవన్ నటించిన వెట్టై సినిమాలో ఆర్య పాత్రలో శింబు నటించాల్సి ఉండగా ఆ హిట్ ను మిస్ చేసుకున్నాడు.. తెలుగు లో ఈ సినిమా తడాఖా గా రూపొందింది.. అలాగే గౌతమ్ మీనన్ లో నటించే ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నాడు శింబు.. అదేకాకుండా ఖుషి లాంటి సూపర్ హిట్ తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో ని ఓ సినిమా కూడా మిస్ చేసుకున్నాడు శింబు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: