ట్రెండింగ్ సినిమాలతో హోరెత్త బోతున్న ఓటీటి !

Seetha Sailaja

కారోనా సెకండ్ వేవ్ మళ్ళీ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు రావడానికి భయపడిపోతున్నారు. దీనితో మళ్ళీ ఓటీటీ హవా మొదలైంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్  మూవీగా సంచలనం సృష్టించిన ‘జాతిరత్నాలు’ ఏప్రిల్ 11నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్  అవుతోంది.  ఏప్రిల్ 14 నుంచి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగు అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించిన ఈ మూవీని మళ్ళీమళ్ళీ చూడటానికి ఓటీటీ ప్రేఖకులు బాగా ఆశక్తి కనపరుస్తున్నారు.  ఇక విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కు కూడ త్వరలో ఓటీటీ లో స్ట్రీమ్ కాబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మే మూడవ వారం నుండి స్ట్రీమ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ఇదే బాటలో ‘చావు కబురు చల్లగా’ కూడా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోంది.  ఈ నెల 23 న ఆహాలో ఈమూవీ రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వకీల్ సాబ్’  వచ్చేనెలాఖరు ప్రాంతంలో జీ5లో స్ట్రీమ్ అవుతుంది అని అంటున్నారు.   ఇప్పటికే `గాలి సంపత్`  ఆహ ఓటీటీ లో సృట్టిస్తున్న  సంచలనాలు  తెలిసినవే. ఈతెలుగు సినిమాలు చాలవు అన్నట్లుగా
వీటితో పాటు  వివిధ భాసలకు సబంధించిన కొన్ని క్రేజీ  మూవీలు ఓటీటీ  బాట పట్టబోతున్నాయి .

ఈ మధ్యనే కన్నడంలో రిలీజ్ అయి తెలుగు లో డబ్ చేయ బడిన కన్నడ  సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ ‘యువరత్న’ కూడ అతి త్వరలో ఓటీటీ లోకి రాబోతోంది. లేటెస్ట్ గా స్ట్రీమ్ అయిన అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్ బుల్ట్ ‘హలో చార్లీ’  మూవీలను ఓటీ ట ప్రేక్ష షకులు బాగా చూస్తున్న విషయంతెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: