కలెక్షన్స్ లో విజయ్ మాస్టర్ ని కూడా మించిపోయిన జాతిరత్నాలు

NIKHIL VINAY
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతి రత్నాలు’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న విడుదల అయ్యింది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.ఈ సినిమా దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో విడుదలై.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో అదరగొడుతోంది. మొదటి రోజు ‘జాతి రత్నాలు'కు భారీగానే కలెక్ట్ చేయడం విశేషం.ఓ చిన్న సినిమాగా విడుదలై ఇంత మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు.అయితే ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ లో తమిళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా విజయ్ మాస్టర్ సినిమాని 3 రోజాల్లో క్రాస్ చేయడం విశేషం.ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి. ఈ సినిమా త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. దీంతో వచ్చేవి అన్ని లాభాలే అన్నమాట. ఏది ఏమైనా సినిమాలో కంటెంట్ ఉండి.. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ చేస్తే.. ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తాయని మరోసారి నిరూపించింది ఈ సినిమా. ఇక నవీన్ పొలిశెట్టి కి ఈ వరస హిట్స్ రావడంతో ఆయన రేంజ్ మెల్లగా పెరుగుతుంది. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చాలా బాగా కలిసొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: