ప్రభాస్ 24.. సంచలన మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం..?

P.Nishanth Kumar
నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుపుతుండగా శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది.. తొలి సారి వీరి కాంబో లో సినిమా రాబోతుండగా సినిమాపై అంచనాలు మాములుగా లేవు..  వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా..  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్.
 ఇక రాధే శ్యామ్ సినిమా జులై 30న రిలీజ్ కాబోతుంది. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ నాలుగు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే తదుపరి చిత్రం పై ఇప్పటినుంచే ప్రచారం మొదలయ్యింది. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిలో ఆదిత్య.. ప్రభాస్ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాడని, ఒక సంచలన మల్టీస్టారర్ మూవీకి అతను రంగం సిద్ధం చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ 24వ సినిమాగా తెరకెక్కబోయే ఆ చిత్రం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ తీయడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కలయికలో ‘వార్’ లాంటి భారీ చిత్రం తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. టైగర్ స్థాయి తక్కువ అయినప్పటికీ ‘వార్’ బ్లాక్‌బస్టర్ అయింది. అలాంటిది హృతిక్ రోషన్ ఎదురుగా ప్రభాస్ ఉంటే.. వీరితో సిద్దార్థ్ మార్కు యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తే ఎలా ఉంటుందన్న ఊహే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: