సమంత షాకింగ్ నిర్ణయం.. ఎవరూ ఊహించని డెసిషన్..!

NAGARJUNA NAKKA
సమంత షాకింగ్‌ డెసిషన్‌ తీసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ కంటిన్యూ చేస్తోన్న సామ్, ఇప్పుడు సినిమాలకి బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. రెండేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉంటుందట సమంత. మరి సామ్‌ సడన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే సందేహాలు తలెత్తుతున్నాయి.
సమంత పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. సామ్ అమ్మ కాబోతోందని, సినిమాలకి గ్యాప్‌ ఇస్తుందనే టాక్ కూడా వచ్చింది. కానీ ఈ బేబీ మాత్రం కెరీర్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంది. మిసెస్‌ చైతన్యగా మారకముందు రీజనల్ ఫిల్మ్స్‌ చేసిన సమంత, మిసెస్‌ చైతన్యగా మారాక పాన్ ఇండియన్ మూవీస్ చేస్తోంది.
సమంత రీసెంట్‌గానే గుణశేఖర్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ డ్రామాకి సైన్ చేసింది. 'శాకుంతలం' అనే సినిమా చెయ్యబోతోంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది ఈ సినిమా. గుణశేఖర్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న ఈ కథ పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా వస్తోంది.
పీరియాడికల్ డ్రామా అంటే షూటింగ్‌ కంప్లీట్‌ కావడానికి చాలా రోజులు పట్టే అవకాశముంది. సెట్స్, గ్రాఫిక్స్‌తో సినిమా పూర్తవ్వడానికి మినిమం ఏడాదైనా పట్టొచ్చు అనుకుంటోందట సమంత. ఇక బ్రేక్ లేకుండా ఏడాది పాటు సినిమా చేశాక, కొంచెం రెస్ట్‌ తీసుకుంటే బెటర్‌ అనే ఆలోచనలోకి వెళ్లిందట సమంత. అందుకే 'శాకుంతలం' రిలీజ్ అయ్యాక సామ్ ఏడాది నుంచి రెండేళ్ల వరకు బ్రేక్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి సమంత సినిమాలకు రెండేళ్లు బ్రేక్ ఇచ్చేందుకు తెగ ఆలోచిస్తోంది. శాకుంతలం తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియన్ మూవీగా వస్తోన్న శాకుంతలం సినిమాపై అంచనాలు పెద్ద ఎత్తునే ఉన్నాయి.
మార్చిలో ప్రారంభం కాబోతున్న శాకుంతలం సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై సమంత అభిమానులు, అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: