కంగనా ముందు చూపు అదిరిపోయింది

Naga Sai Ramya
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రణౌత్, డిఫెన్స్ మినిష్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిసింది. తన రాబోయే చిత్రం "తేజాస్" కి బ్లెస్సింగ్స్ ను అందుకుంది. ఈ మీటింగ్ కి సంబంధించిన పిక్చర్స్ ను కంగనా ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ సినిమాలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించబోతోంది.
ఈ స్క్రిప్ట్ ను కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీంతో కూడా షేర్ చేసుకుని అందుకు సంబంధించిన అనుమతులను కూడా అందుకున్నట్టు కంగనా పేర్కొంది. మొత్తానికి కంగనా ముందుచూపును పలువురు ప్రశంసిస్తున్నారు. సినిమా పూర్తయ్యాక అబ్జక్షన్స్ రావచ్చేమో అన్న సంశయాన్ని పోగొట్టుకోవడానికి కంగనా ముందుగానే స్క్రిప్ట్ ను కూడా సంబంధిత టీంతో షేర్ చేసింది. ఎంతైనా, కంగనాకు చూసి నేర్చుకోవాలి అనంటోంది బాలీవుడ్ మీడియా.
"తేజాస్" ను సర్వేశ్ మేవారా డైరెక్ట్ చేస్తున్నారు. రోనీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఒకానొక సందర్భంలో కంగనా ఓ స్టేట్మెంట్ చేసింది. చిన్నప్పటి నుంచి సోల్జర్ పాత్రలో కనిపించాలని కోరుకున్నట్టు చెప్పింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో చిన్నప్పటి నుంచి ఎంతగానో ఎక్సయిటెడ్ గా ఉన్నట్టు చెప్పింది. జవాన్స్ ను తాను హీరోలుగా భావిస్తానని చెప్పుకొచ్చింది. వారు మన కంట్రీను సేఫ్ గా ఉంచడంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని చెప్పుకొచ్చింది. ఈ సినిమా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది.
ఇక రీసెంట్ కంగనా లుక్ ను పరిశీలిస్తే, దేశి లుక్స్ లో కూడా భలే స్టైలిష్ గా కనిపించింది. అందమైన పింక్ కుర్తాలో సర్కులర్ షేడ్స్ తో సందడి చేసింది. దేశీ అవతార్ లో కూడా లుక్స్ ను అదరగొట్టొచ్చు అని ప్రూవ్ చేసింది. దేశ రాజధానిలో వింటర్ క్యాపిటల్ లో సందడి చేసింది కంగనా.
ఈ సినిమా బహుభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తన రోల్ కోసం కంగనా గత కొంత కాలంగా హోమ్ వర్క్ చేస్తోంది. ఎంతగానో ప్రిపేర్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: