గత ఏడాది పడి పడి లేచె మనసు తో భారీ డిజాస్టర్ ను చవిచూసిన సాయి పల్లవి ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి విరాటపర్వం. వేణు ఊడుగుల డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరి గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. వీరితో పాటు మలయాళ నటి నందితా దాస్ మానవ హక్కుల నేతగా కనిపించనుండగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా నక్సలైట్ గా నటిస్తుంది. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు కానీ నేడు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఓ అప్డేట్ రానుందని సమాచారం. బహుశా సాయి పల్లవి ఫస్ట్ లుక్ ను కానీ విడుదలచేస్తారేమో చూడాలి. సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విడుదలకానుంది.
ఇక ఈ సినిమాతోపాటు సాయి పల్లవి ప్రస్తుతం లవ్ స్టోరి లో కూడా నటిస్తుంది దాంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకు సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఓ సప్రైజ్ ను ప్లాన్ చేసింది చిత్ర బృందం. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకో 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది. యూత్ ఫుల్ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలోకి తీసుకరావడనికి సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ ,అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.