విజయ్ దేవరకొండ కొత్త వ్యాపారం..!

NAGARJUNA NAKKA

నిన్నటి తరం హీరోలు సినిమా చేశామా.. హిట్ అయ్యిందా.. ఇమేజ్ పెంచుకున్నామా అనే విధంగా ఆలోచించే వారు. కానీ ఈ జనరేషన్ హీరోలు అంతకుమించి ఆలోచిస్తున్నారు. రౌడీ బ్రాండ్స్ తో మార్కెట్ లో న్యూ వైబ్రేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ఇపుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ యంగ్ హీరో బిజినెస్ లో మహేశ్ బాబునే టార్గెట్ చేశాడు. 

 

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత. కానీ క్రేజ్ ఉండగానే వాడుకోవాలనేది ఈ జనరేషన్ హీరోల కొత్త సామెత.  క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇదే ప్లాన్ తో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నాడు. అరడజన్ సినిమాలతో ఊహించని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇపుడు ఆ క్రేజ్ ని మార్కెట్ చేసుకునేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాడు. 

 

విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్ పరంగా క్షణం తీరికలేకుండా ఉన్నాడు. అయినప్పటికీ ఈ యంగ్ హీరో అటు సినిమాలతో పాటు అటు బిజినెస్ చేస్తుండటం విశేషం. విజయ్ ఇప్పటికే రౌడీ బ్రాండ్స్ పేరుతో క్లాత్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ క్రేజీ హీరో లేటెస్ట్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు సమాచారం. 

 

ఇప్పటికే మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. ఇపుడు విజయ్ దేవరకొండ కూడా మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ రంగంలో టైకూన్ గా పేరొందిన ఏషియన్ సినిమాస్ తో విజయ్ టై అప్ అయినట్టు వినిపిస్తోంది. ప్రస్తుతంవిజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు పూరీ జగన్నాథ్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: