కంగనా.. తీసుకున్న మరో సంచలన నిర్ణయం..??

Sirini Sita

కంగనా రనౌత్ పేరు వింటేనే వెరెక్కిపోయే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. దర్శకులు., నిర్మాతలు ఇమే డేట్స్ దొరికితే చాలని ఎదురు చూస్తూ ఉంటారు.. బాలీవుడ్ లో ఈమెకున్న క్రేజ్ అలాంటిది మరి.. అయితే ఈ మధ్య మన కంగనా తరచూ వార్తల్లో ఎక్కడం మనం చూస్తున్నాం.. ఈ మధ్య కాలంలో ఈమె ఏం చేసినా కూడా వైరల్ గా మారుతుంది.. మొన్న రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ షాక్ ఇచ్చింది.. వెంటనే కేవలం హీరోయిన్ గానే కాకుండా జనవరి నుంచి కొత్త నిర్మాణ సంస్థ పెడుతున్నట్టు ఓ ప్రకటన ఇచ్చేసింది.. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో సినిమా తీయబోతోందిట..

 

 

వివరాల్లోకి వెళితే తమిళంలో అమలాపాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైంది. ఈ సినిమాలో నూలుపోగు కూడా ధరించకుండా అమలాపాల్ నటించిన కొన్ని సన్నివేశాలు భారీ ఎత్తులో సంచలనం సృష్టించారు. రత్నకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో విమర్శకుల ప్రసంశలు పొందింది. ఇదిలావుండగా ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్‌ కాబోతోందని., రత్నకుమారే హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నటుగా వార్తలు వస్తున్నాయి.. అయితే హిందీ రీమేక్‌లో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేవారిలో కంగనా రనౌత్‌ పేరు ముందు వరుసలో వినిపిస్తోందని.,, అధికారిక ప్రకటన రావాల్సి ఉందని సమాచారం.. అయితే ధైర్యంగా బోల్డ్ గా అమలాపాల్ నటించిన ఈ సినిమా ఒకవేళ కంగనా రీమేక్ చేస్తే అంతే బోల్డ్ గా నటించగలరేమో వేచి చూడాలి..

 

 

ఒక్క బాలీవుడ్ లోనే కాదు తెలుగులోనూ ఈ అమ్మడికి ప్రత్యేక స్థానం ఉంది.. ప్రభాస్ సరసన ఈ అమ్మడు నటించిన ఏక్ నిరంజన్ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి బాగానే గుర్తుండి పోయింది.. తెలుగులో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న మణికర్ణిక సినిమాలో ఈమె హీరోయిన్ గా చేయబోతున్న వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చేశాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: