వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ వెళ్ళిపోయి, టార్చ్ లైట్ పట్టుకొని వచ్చిన సదా

Varma Vishnu
తేజ దర్శకత్వంలో వచ్చిన జయం’ మూవీలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణి కట్టుకుని కుర్రకారు మదిలో సదా చేసిన గజ్జెల సౌండ్ చానాళ్లు టాలీవుడ్‌లో రీసౌండ్ వచ్చింది.  ఆ మూవీలో సదా అచ్చ తెలుగు ఆడపిల్లలా ప్రేక్షకులకు ఆకట్టుకుంది.  'జయం' సినిమా మంచి హిట్ అవ్వడంతో  వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.   అనంతరం ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, నటుడు విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. 

ఆ సినిమాలో సదా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన.. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోవడంతో సదాకు అవకాశాలు సన్నగిల్లాయి.  కాగా కొన్ని రోజులు రియాలీటి షోల్లో జడ్జిగా కూడా అలరించిన సదా తాజాగా వేశ్యలకు సంబంధించిన ఓ సినిమాతో ముందుకొచ్చింది. 1990లో తమిళనాడు - ఆంధ్ర హైవేలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఒక వేశ్య జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనల్ని తెరకేక్కించిన చిత్రంలో సదా లీడ్ రోల్ ప్లే చేస్తుంది.

తాజాగా  ‘శ్రీమతి 21F సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ  ట్రైలర్‌లో సదా హైవే పక్కన టార్చ్ లైట్ వేసి లారీలను ఆపే వేశ్యపాత్రలో నటించి షాక్ ఇచ్చింది.  ‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?’.. అంటూ శృంగాల సన్నివేశాల్లో రెచ్చిపోయి నటిస్తోంది. ఒక వేశ్య బాధను ఈ పాత్ర ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అశ్లీలత ఎక్కువగా ఉంది.  సదా అంగాగ ప్రదర్శనతో తనలోని గ్లామర్ యాంగిల్‌కు పదునుపెట్టింది. ఇంత అచ్చ తెలుగు అమ్మాయిలా, లక్షణమైన క్యారెక్టర్స్ లో చూసిన  సదాని ఇలా వేశ్య పాత్రలో చూసి తట్టుకోలేకపోతున్నా అభిమానులు.


కానీ నటనకు తారతమ్యాలు చూపిస్తే కుదరదు. ఇలాంటి విలక్షణమైన పాత్రల్లోనే టాలెంట్ చూపించుకోగలరు నటులు.   ఒక బలమైన నేపథ్యం ఉన్న కథతో సదా గట్టి సందేశాన్ని ఇచ్చే సాహసాన్ని ఈ వేశ్య పాత్ర ద్వారా చేసింది.  ఈ చిత్రానికి అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించగా.. ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: