సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సుకుమారుడు’

Prasad
సాయికుమార్ కుమారుడు ఆది నటిస్తున్న కొత్త సినిమా సుకుమారుడు. ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా ఈ నెల 10న విడుదల అవుతుంది. 

‘ప్రేమకావాలి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఆదికి ఈ సుకుమారుడు 3వ చిత్రం. మొదటి రెండు సినిమాలు విజయవంతం కావడం తో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘పిల్ల జమీందార్’ సినిమాతో దర్శకుడుగా నిరూపించుకున్న ఆశోక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

కాగా, ఈ సుకుమారుడు సినిమాలో ఆది సరసన నిషా ఆగర్వాల్ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: