కవలలకు జన్మనిచ్చిన యాంకర్ ఉదయభాను..!

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై హృదయాంజలి ప్రోగ్రామ్ తో బాగా పాపులర్ అయిన యాంకర్ ఉదయభాను తర్వాత వెండి తెరపై కూడా మెరిసిపోయింది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఆమె లీడర్ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ‘రాజశేఖరా..’ అనే పాటపై అద్భుతమైన డ్యాన్స్ చేసి ఔరా అనిపించింది. తర్వాత వివిధ చానెల్స్ లో యాంకర్ గా చేస్తూ ప్రైవేట్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. గత సంవత్సరం నుంచి ఉదయభాను బుల్లి తెరపై కానీ, వెండి తెరపై కానీ కనిపించలేదు.

ఆ మద్య తాను ఎక్కడా కనిపించడం లేదు అన్ని విషయంపై ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది..ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీ అని త్వరలో కవలలకు జన్మనివ్వబోతున్నానని చెప్పింది..తనపై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో సెలబ్రెటీలు అన్న తర్వాత ఇలాంటి రూమర్స్ కామన్ అని అన్నారు.  తాజాగా ఉదయభాను కవల పిల్లలకు జన్మనిచ్చింది.

శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. యాంకర్‌గా ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఉదయభాను కొద్దికాలంగా తెరకు దూరంగా ఉన్నారు. విజయవాడకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని స్థిరపడిన ఉదయభాను ఇన్నాళ్లకు మళ్లీ వార్తొల్లోకొచ్చింది. ఉదయభాను అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: