మనీ: ఎల్ఐసి నుంచి మరో ఆకర్షణీయమైన పాలసీ..!

Divya
ఇటీవల కాలంలో బీమా కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ సామాన్య ప్రజలను మొదలుకొని సీనియర్ సిటిజెన్ల వరకు ఎంతోమందికి ఆసరాగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఆకర్షణీయమైన పాలసీతో మన ముందుకు వచ్చింది ఎల్ఐసి. ఇప్పటివరకు ఎన్నో ఆకర్షణీయమైన స్కీమ్స్ తో మన ముందుకు వచ్చిన ఎల్ఐసి ఇప్పుడు ధన్ సంచయ్ అనే పేరుతో సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో వినియోగదారులకు మొత్తం నాలుగు రకాల ఆప్షన్ లు అందుబాటులో ఉంటాయి. ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్ తో పాటు గ్యారెంటీ ఇన్కమ్ కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఏ బి సి డి అనే ఆప్షన్ లో ఈ పాలసీని అందిస్తున్నారు.
ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక ప్రయోజనాన్ని అందించబోతున్నారు.  పాలసీ కాలవ్యవధి ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది.  కాబట్టి డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్లపాటు వాయిదా పద్ధతిలో కూడా పొందుతారు. ఇది నాన్ లింక్డు.. పార్టిసిపేటింగ్.. ఇండివిజువల్ .. సేవింగ్ ప్లాన్.ఈ నాలుగు ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఏబీ ఆప్షన్స్ లో హామీ మొత్తం కనీసం రూ.3,30,000 అలాగే ఆప్షన్ సి లో రూ.2,50,000 అలాగే ఆప్షన్ డి లో రూ.22,00,000 వరకు సమ్ అస్యూర్డ్ ను పొందవచ్చు..
ఈ స్కీం లో చేరడానికి పాలసీదారుడు వయసు కనీసం మూడు సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఏ, బీ లకు 50 సంవత్సరాలు, సీ కి 65 సంవత్సరాలు అలాగే డి పరిమితి 40సంవత్సరాలుగా ఉండాలి. ముఖ్యంగా ఏడాదికి కనీస ప్రీమియంగా 30 వేల రూపాయలుగా ఉంటుంది ఐదు , పది లేదా 15 సంవత్సరాల పాలసీ గనుక మీరు ఎంచుకున్నట్లయితే ప్లాన్ లో కనిష్టంగా రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.22 లక్షల అస్యూర్డు పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: