మనీ: ఏడాదికి రూ.30 లక్షలు సంపాదిస్తున్న మహిళా రైతులు.. ఎలా అంటే..?
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన 20 స్టార్టప్ లను విజయవంతంగా నడుపుతూ ముందుకు వెళ్లడం గమనార్హం. ముఖ్యంగా అందులో ఐదు సేంద్రియ వ్యవసాయం.. రెండు డెయిరీలు, పదమూడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన సంతోష్ కేదార్ అనే ఒక మహిళా రైతు దానిమ్మ సాగులో ప్రత్యేకత చూపించింది. నిజానికి ఆమె భర్త హోంగార్డుగా పని చేసేవారు. ఇక దానిమ్మ తోట నాటాలని ఆలోచన అతడికి వచ్చింది. దీంతో వారు ఈ సాగును వెంటనే ప్రారంభించడం కూడా జరిగింది. దానిమ్మ మొక్కలు నాటిన తర్వాత మొదటి పంట రావడానికి సుమారుగా మూడు సంవత్సరాల కాలం పట్టింది . ఇక ఈ పంట ద్వారా ఏడాదికి ఎంత ఆదాయం వస్తుందో కూడా ఆమెకు తెలియదు. కానీ చివరికి వారి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో వారి ఆదాయం కూడా బాగా రెట్టింపు అవడం గమనార్హం.
ఇకపోతే దానిమ్మ చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వీరు నిమ్మ , జామ మొక్కలు కూడా నాటారు. ఇక ప్రయోగం కూడా విజయవంతమై ఏడాదికి పది లక్షల రూపాయల ఆదాయం కూడా దాటింది. మొత్తంగా అటు ఇటు సంవత్సరానికి 30 లక్షల రూపాయల ఆదాయం ఆమె పొందుతూ ఉండడం గమనార్హం.