లగ్జరీ లైఫ్ కోసం ఇండియాలో బెస్ట్ సిటీ ఏది? 2025 రిపోర్ట్ సంచలనాలు బయటపెట్టింది!
ముంబై: వారసత్వ వైభవానికి ప్రతీక :
దేశ ఆర్థిక రాజధాని ముంబై, ప్రపంచ ధనవంతుల జాబితాలోనూ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జూలియస్ బేర్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్స్టైల్ రిపోర్ట్ 2025 ప్రకారం, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై 20వ స్థానంలో నిలిచింది. ఖరీదైన రియల్ ఎస్టేట్ నుంచి ప్రైవేట్ క్లబ్లు, విలాసవంతమైన కార్లు, హై-ఎండ్ ఫ్యాషన్ హౌస్ల వరకు... ముంబైలో డబ్బు ఖర్చు చేయడం ఒక వేరే లెవల్. ఇండియాలో అత్యంత ఖరీదైన నగరం ఇదే. లెగసీ సంపదకు, బిలియనీర్లకు ఈ మహానగరం ఆతిథ్యం ఇస్తోంది. భారీ జీడీపీతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముంబై పట్టం కడుతోంది.
టెక్ సిటీల సవాల్: కొత్త లగ్జరీ యుగం :
ముంబై వారసత్వ వైభవానికి సవాల్ విసురుతూ, టెక్ సిటీలు తమ సత్తా చాటుతున్నాయి. నివాసయోగ్యత, సాంస్కృతిక ఆకర్షణ, ఆర్థిక బలం ఆధారంగా విడుదలైన 'వరల్డ్స్ బెస్ట్ సిటీస్ 2025' జాబితాలో భారతీయ నగరాల్లో బెంగళూరు అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. గ్లోబల్ స్థాయిలో 29వ ర్యాంకు సాధించిన ఈ టెక్ హబ్... కొత్త తరం విలాసానికి కేంద్రంగా మారింది. అదేవిధంగా, ఫార్మా, టెక్ దిగ్గజాలకు నిలయంగా ఉన్న హైదరాబాద్ కూడా లగ్జరీ రియల్ ఎస్టేట్ వృద్ధిలో దూసుకుపోతోంది. కోకపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలలో ఎన్నారైలు, హెచ్ఎన్ఐలు పెట్టుబడులు పెడుతున్నారు. లగ్జరీ రెసిడెన్సీలకు, ఆధునిక జీవనశైలికి ఈ నగరాలు వేదికగా మారాయి.
భవిష్యత్ రేసు: ఎవరు విజేత? :
ఢిల్లీ-ఎన్సీఆర్ సైతం లగ్జరీ రియల్ ఎస్టేట్లో దూకుడు చూపుతున్నప్పటికీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ప్రపంచ స్థాయి విలాసంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. పాతతరం ఆర్థిక శక్తులు ఒకవైపు, కొత్త తరం టెక్ సంపద మరోవైపు.. భారతీయ లగ్జరీ మ్యాప్ను వేగంగా మార్చేస్తున్నాయి. ఈ పోటీలో ఏ నగరం విలాసానికి అసలు సిసలు చిరునామాగా మారుతుందో చూడాలి!