ముఖేష్ అంబానీ కుటుంబం తాగే పాల ధర ఎంతో తెలుసా..?

Divya
ఎలాంటి విషయాలలోనైనా సరే ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారు తినే భోజనం నుంచి చేసే వ్యాపారాల వరకు తరచు ఏదో ఒక విషయంలో వీరి గురించి వినిపిస్తూనే ఉంటారు. గడిచిన కొన్ని నెలల క్రితం అంబానీ చిన్న కుమారుడు ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్గా చేశారో ప్రపంచమంతా తెలిసిందే. ముఖ్యంగా అంబానీ కుటుంబం వాడే వస్తువులు, కార్లు , బంగ్లాలు గురించి నిరంతరం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అంబానీ కుటుంబం తాగేటువంటి పాల గురించి ఒక చర్చ వినిపిస్తోంది. వాటి గురించి చూద్దాం.

ముఖేష్ అంబానీతో సహా ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా చాలా స్వచ్ఛమైన పాలను ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారట. అందుకే ప్రతిరోజు ఆహార పదార్థాలు తాజావే వస్తూ ఉంటాయని సమాచారం. అయితే ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చే పాలు కూడ చాలా స్పెషల్ గానే ఉంటాయట. ముఖేష్ అంబానీ కుటుంబానికి విదేశీ జాతికి చెందిన స్టేయిన్ ప్రిసియన్ అనే జాతికి చెందిన ఆవు పాలను మాత్రమే తాగుతున్నారట. ఈ పాలలో చాలా పోషకాలు కలిగి ఉంటాయని ముఖ్యంగా మైక్రో న్యూట్రియన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

అయితే ఈ జాతి ఆవులు ఎక్కువగా పూణేలో ఉంటాయట. భాగ్యలక్ష్మి డైరీలో సుమారుగా 3 వేలకు పైగా జాతి ఆవులు కలిగి ఉందట. ఈ ఆవులు నివసించడానికి ప్రత్యేకమైన పరుపులను కేరళ  నుంచి భారీ ఖర్చుతో తీసుకొని పోతూ ఉంటారట. ఈ ఆవులు OR నీటిని మాత్రమే తాగుతాయట .ఇవి సుమారుగా ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల వరకు పాలను ఇస్తాయట. ఈ పాలు లీటర్ ధర రూ .200 రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఆవు బరువు ధర కూడా 600 కిలోలకు పైగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: