డయాబెటిక్ రోగులకు ఈ గింజలు వరం లాంటివి?

Purushottham Vinay
డయాబెటిక్ పేషెంట్స్ వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా పెరగవచ్చు.. దీంతో మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.అయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చాలా వరకు నిర్వహించగల కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.. వాటిలో తామర విత్తనాలు అద్భుతమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అయితే తామర పువ్వు విత్తనాల ద్వారా డయాబెటిస్ ను ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.నిజానికి తామర పువ్వు విత్తనంలోని ఔషధగుణాలు మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిని చాలా ఈజీగా నియంత్రించవచ్చు.ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..డయాబెటిక్ రోగులకు ఈ గింజలు వరం లాంటివి. 


అలాంటి వాటిల్లో తామర గింజలు పోషకమైన ఆహారం కంటే తక్కువ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పువ్వు విత్తనాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.ఎందుకంటే తామర గింజలు చాలా మంచివి. ఇందులో చాలా పోషకాలు దాగున్నాయి. ఇంకా ఇందులో విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహులకు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.. ఈజీగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలవు. తామర విత్తనాలు క్రమం తప్పకుండా తింటే అధిక రక్తపోటును కూడా ఈజీగా నియంత్రించవచ్చు.భారతీయ సంస్కృతిలో తామర పువ్వును ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు.. ఇండియాలో దీనిని పూజకు ఉపయోగిస్తారు. అలాగే ఈ పువ్వు మూలాల నుంచి రుచికరమైన కూరను కూడా తయారు చేస్తారు. రుచికరమైన దీనిని ప్రజలు ఎంతో ఆస్వాదిస్తూ తింటారు. ఇక బురదలో పెరిగే ఈ పూలను అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. అయితే.. మీ ఇంటి దగ్గరలో చెరువు లేకుంటే.. పెద్ద కుండీలో ఇళ్లల్లో కూడా ప్రత్యేక పద్ధతిలో వీటిని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: