కేవలం రూ. 981 లతో రూ. 36 కోట్ల భవంతి... ?

VAMSI
అదృష్టం ఉండి కాలం కలిసి రావాలి కానీ నేలను చూసే నిరుపేద కూడా నింగిని తాకే ధనవంతుడు కాగలడు. ఇపుడు ఈ వార్త వింటే అదృష్టం వీరికి అతుక్కుపోయిందేమో, నక్క తోక తొక్కినారా అంటూ నోరెళ్ళబెడతారు. విషయం అలాంటిది మరి. ఇంగ్లాండ్ లో అదృష్టం కలిసి రావడంతో ఓ దంపతుల జీవితమే పూర్తిగా మారిపోయింది. బెక్కా పాట్ అనే ఒక మహిళ లాటరీ ద్వారా రూ. 35.8 కోట్ల విలువైన భవంతిని తన సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఇంగ్లండ్‌కు చెందిన 32 ఏళ్ల బెక్కా పాట్ అనే మహిళ "ఓమేజ్ మిలియన్ పౌండ్ హౌస్ డ్రా" లో పాల్గొని ఒక టికెట్టు ను కొన్నది. ఆ టికెట్టు కోసం ఆమె చెల్లించింది కేవలం రూ. 981 మాత్రమే.
మామూలుగా ఆమె భర్త తరచూ ఒమేజ్ మిలియన్ పౌండ్ హౌస్ లో టికెట్టు కొంటూ ఉంటాడు. అయితే ఈసారి అతను టికెట్టు కొనకపోవడంతో అతని భార్య  బెక్కా జనవరిలో రూ.981 టిక్కెట్ బండిల్‌ను కొన్నది. అదృష్టవశాత్తు ఆమెకు మత్తెక్కితే డ్రాలో వచ్చింది. దాంతో ఆమెకి ఆ లక్కీ డ్రాలో వచ్చినటువంటి విలాసవంతమైన భవంతిని ఇచ్చారు.  నిన్న మొన్నటి దాకా బిడ్డలతో కలిసి డబుల్ బెడ్ రూం లో సర్దుకుని జీవించేవారు, నేడు అదృష్టం లక్కీ డ్రా రూపం లో వరించడంతో పెద్ద భవంతిని సొంతం చేసుకున్నారు. ఆ భవంతి లో ఐదు పడక గదులు, నాలుగు లక్సరి బాత్‌రూమ్‌లు ఉన్నాయి.
ఆ భవంతి పరిసరాల్లోని క్వీన్స్ హిల్‌లో అస్కాట్ హై స్ట్రీట్,  అస్కాట్ రేస్‌కోర్స్ సమీపంలో ఉంది. ఈ విలాసవంతమైన భవంతిని సంబందించి అన్ని డాక్యుమెంట్లను ఆ దంపతులకు అందజేశారు. అయితే ఎవేరికి అదృష్టం బాగుంది కాబట్టి ఇలా సడెన్ గా ఇంత పెద్ద ఇంటిని గెలుచుకున్నారు. అయితే ఇలా లక్కీ డ్రా లకోసం డబ్బులు ఖర్చు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు అన్నది చాలా మంది అభిప్రాయం. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేదు, పైగా లాటరీ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ అటూ ఇటూ అయినా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: