వీటిని అధికంగా తింటున్నారా..అయితే క్యాన్సర్ వచ్చినట్టే..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండకపోతే లేనిపోని ఇబ్బందులను ఎన్నో ఎదుర్కోవాల్సి కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి చిన్న వయసులోనే తనువు చాలిస్తున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం.. అనుసరించే జీవన విధానాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వీటి వల్లే కలుగుతాయి. ప్రత్యేకించి కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రతిరోజు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. ముఖ్యంగా ఇలాంటి ఆహార పదార్థాలను అతిగా తీసుకుంటే క్యాన్సర్ తో పాటు ప్రమాదకరమైన వ్యాధులు కూడా రావచ్చు.. ఇకపోతే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.. పులియబెట్టిన ఆహార పదార్థాలలో జున్ను , పెరుగు,  దోస వీటిని గనుక ప్రతిరోజు డైట్లో ఎక్కువ మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. ఇకపోతే ముల్లంగిని చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముల్లంగిని సలాడ్ రూపంలో తీసుకుంటే శరీరానికి పొటాషియం ఎక్కువగా లభిస్తుంది..దీనివల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి అలాగే క్యాన్సర్ సమస్యలను కూడా ముల్లంగి కలిగిస్తుంది.
అలాగే ఎండిన కాయగూరలు కూడా డైట్లో ఎక్కువగా తీసుకోరాదు.. జీర్ణం అవ్వడానికి ఇవి చాలా సమయం తీసుకుంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంలో ఇది ప్రథమ స్థానం వహిస్తాయి.  అలాగే గొడ్డు మాంసం,  మేక మాంసం,  పంది మాంసం వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది.. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు మీరు దూరంగా ఉన్నట్లయితే సాధ్యమైనంతవరకు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడ్డట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: