బుడుగు: పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గితే తలెత్తే సమస్యలు ఇవే..!

N.ANJI
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరి ఎదుర్కొనాలంటే బాడీలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఒకేసారి చూద్దామా.
పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా జీర్ణసంబంధ సమస్యలు ఎదురువుతాయి. ఇక పిల్లల్లో ఆకలి తగ్గడం, ఊబకాయం, విరేచనం పలుచగా, పలుమార్లు అవడం, మలబద్ధకం, ఆహార సంబంధ అలర్జీలు, బలహీనత, అలసట వంటివి జీర్ణసంబంధ సమస్యల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కరివేపాకు కారం, సొంఠి కారం, సంప్రదాయ పచ్చళ్లు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆకలి లేకపోవడం, ఆహారం తినాలనే కోరిక తగ్గడం మొదలైన సమస్యలకు అగ్నితుండివటి ఈ ఔషధాన్ని వాడుతుంటారు. ఈ మందును ఉదయం, సాయంత్రం ఒక మాత్ర చొప్పున తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యవర్ధిని వటిని తీసుకుంటున్న వారికీ ఆహారం తింటున్నా, తరచూ ఏదో ఒకటి తినాలనే కోరిక కలగడం, ఎప్పుడూ నీరసంగా ఉండడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇక రోజు రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలని అన్నారు.
అలాగే బిళ్వజిల్‌ ఔషధాన్ని విరోచనం గట్టిగా అవడం, అవకపోవడం, ఆహార సంబంధ అలర్జీలు ఉన్నవారు తీసుకుంటే మంచిది. ఇక ఈ ఔషధాన్ని నీళ్లతో కలిపి ఉదయం, సాయంత్రం 10 మి.లీ తీసుకోవాలని అన్నారు. అయితే మహా సుదర్శన ఘనవటి వయసును బట్టి ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు మాత్రల చొప్పున ఆహారం తర్వాత తీసుకోవాలని అన్నారు. ఇక విరోచనం సరిగా కాని వారు, కొద్ది కొద్దిగా పలుచని విరోచనం అయ్యేవారు, పొత్తికడుపులో, బొడ్డు దగ్గర నొప్పితో బంక విరోచనాలు అయ్యేవారు వయసును బట్టి ఒకటి లేదా రెండు మాత్రలు భోజనం తర్వాత తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: