బుడుగు : పిల్లలు టెక్నాలజీ గూర్చి తెలుసుకోవడం మంచిదే.. !!కానీ అదే శృతిమించితే...??
ఏ ప్రాజెక్ట్ చేయాలన్న వారు కంప్యూటర్ పైనే గంటల తరబడి గడపల్సి వస్తోంది.ఇంతేకాక జాబ్స్ లోనూ కంప్యూటర్ ముఖ్యమైన పాత్రను పోషించటం వల్ల గంటల తరబడి దృష్టిని కేంద్రీకరించటం వల్ల ఒత్తిడికి లోనై కళ్ళ క్రింద నల్లని వలయాలు,కళ్ళు జీవం లెకుండాపోవటం జరుగుతోంది.శారీరికంగా, మానసికంగా అలసట, చిన్న వయసులోనే కళ్ళ అద్దాలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు.అలాగే ఒత్తిడికి గురవుతున్నరు.కళ్ళకు సంబంధించిన నరాలు విపరీతమైన ఒత్తిదికి లోనై వారిని అసహనానికి గురిచేస్తుంది.అంతేకాక ఈ నరాలకు ఒత్తిడి కలిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది.అంతేకాకుండా కళ్ళు మండటం,కళ్ళు పొడిబారిపోవటం, కంతి నుంచీ నీరు రావటం, మెద,భుజాలు నొప్పులు రావటం జరుగుతుంది.
అందుకనే ఎక్కువ సేపు ఫోన్లు, కంప్యూటర్ చూడడం మంచిది కాదు. చిన్న చిన్న విరామాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.అస్తమానం కంప్యూటర్ పూర్థి స్థాయిలో వాడేవారు గంటకోసారి పది నిముషాలు విరామం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే టీవీ చేసేటపుడు దూరంగా కుర్చీని చూడాలి. రాత్రి అయ్యాక అసలు ఫోన్ చూడకూడదు. వీలయినంత ఎక్కువ సేపు నిద్రపోవాలి.చదువుకునేటప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిదే కానీ మిగతా టైమ్ లో కూడా ఫోన్ అలవాటు చేయడం మంచిది కాదు.. !