చరిత్రపుటలు: ఆరోజు బ్రిటీష్ జెండాను కిందకు దించలేదా?
స్వాతంత్రం రావడానికి ఒక్క రోజు ముందు పది లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, కోటి 20 లక్షల మంది శరణార్థులయ్యారనే విషయం బీబీసీ ఇప్పుడు ప్రత్యేకించి చెప్తుంది. పది లక్షల మంది భారతీయుల ప్రాణాలు అప్పుడు కోల్పోగా నదుల్లో శవాలు కొట్టుకొచ్చినట్లుగా చెప్తుంది అది. మౌంట్ బాటన్ స్వాతంత్రం వచ్చిన రోజున బ్రిటిష్ జెండాను కిందకి దింపితే బ్రిటిష్ వాళ్ళు బాధపడతారని చెప్పడంతో నెహ్రూ మేనేజ్ చేసుకొచ్చారట.
బ్రిటిష్ వాళ్ళ జెండాను కిందకి దింపడం అనే విషయాన్ని పక్కన పెట్టి భారతీయుల జెండాను మాత్రమే ఎగరేసే విధంగా ప్లాన్ చేశారట ఆయన. అంతే కాకుండా సంవత్సరంలో ముఖ్యమైన 12 రోజులు బ్రిటిష్ వారి జెండాను ఎగర వేయాలని కూడా ఆ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారట. మౌంట్ బాటన్ అలాగే భారత దేశపు క్రౌన్ ప్రతినిధి ఆగస్టు 16 1947నాటి టాప్ సీక్రెట్ అండ్ పర్సనల్ రిపోర్ట్ నెంబర్17 లో ఈ బహిర్గతమవ్వని నిజం ప్రచురితమైందని తెలుస్తుంది.
లండన్ లోని ఇండియన్ ఆఫీసులో దీనికి సంబంధించిన వీడియో అందుబాటులో ఉందని అంటున్నారు. స్వాతంత్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి కుది రాం బోస్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎందరో వీరులు తమ ప్రాణ త్యాగం చేశారు. కానీ ఇలాంటి నాయకులు ఉంటారు అనుకుంటే ఏమి చేసేవారో అని అనుకుంటున్నారు కొంత మంది.