చరిత్రలో ఈరోజు ముఖ్య సంఘటనలు..!

MOHAN BABU
1831 లో కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుంచి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.
                          జననాలు
1893లో కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి జన్మించారు . 1988 మరణించారు.
1905లో కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత జన్మించారు.1986 మరణించారు.
1905లో కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి జన్మించారు. 1991 మరణించారు.
1908లో జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి.1953 మరణించారు.  
1924లో కావూరి పూర్ణచంద్రరావు, అష్టావధాని, గ్రంథరచయిత జన్మించారు.
1935లో శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు జన్మించారు.  2015 మరణించారు.
1965లో కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్, అమెరికన్ నటుడు జన్మించాడు.
1971లో కిరణ్ దేశాయ్, భారతదేశ రచయిత్రి జన్మించారు.
1974లో మల్లి మస్తాన్‌ బాబు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. 2015లో మరణించారు.
1978: అర్జన్ బజ్వా, ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు.
                            *మరణాలు*
1962: వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895).
1969: హొ చి మిన్, వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890).
1987: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933).
2011: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ముఖ్యుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927).
2011: ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, పారిశ్రామిక వేత్త. (జ.1921).
                        *ప్రత్యేకతలు*  
                 ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: