చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..
1944 వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధము జరిగింది. ఇది పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగడం జరిగింది.
1956 వ సంవత్సరంలో కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చెయ్యడం జరిగింది.(1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు).
1960 లో స్పుత్నిక్ ప్రోగ్రాం జరిగింది.స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపడం జరిగింది. ఇక అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు ఇంకా 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయి.
2007 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడవ్వడం జరిగింది.
2011వ సంవత్సరంలో ప్రణాళికా సంఘం, ఏప్రిల్ నెల 2012 వ సంవత్సరం నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించడం జరిగింది. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని ఆయన చెప్పాడు. అలాగే 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని అయినా కాని వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పడం జరిగింది.
2011వ సంవత్సరంలో దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరడం జరిగింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర అనేది రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ వచ్చేసి మొదటి యుద్ధనౌక.
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే...
1918 వ సంవత్సరంలో శంకర్ దయాళ్ శర్మ జన్మించారు. ఈయన భారత మాజీ రాష్ట్రపతి.
1923 వ సంవత్సరంలో కొత్తపల్లి పున్నయ్య జన్మించారు. ఈయన న్యాయవాది ఇంకా రాజకీయ నాయకుడు అలాగే మంచి కవి.
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..
0014 వ సంవత్సరంలో ఆగస్టస్ అనే రోమన్ చక్రవర్తి మరణించాడు. (జ.63 బి.సి) ఇక ఈయన పేరు వలన ఆగష్టు నెల అనేది ఏర్పడింది.
1662 వ సంవత్సరంలో బ్లేజ్ పాస్కల్ మరణించడం జరిగింది.ఇక ఈయన పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త.