ప‌దుల సంఖ్య‌లో పెళ్లిళ్లు, 80 మంది సంతానం.. ఆ రాజుగారి కామక్రీడలు చూస్తే షాక్‌..!

Paloji Vinay
భారతదేశాన్ని పాలించిన రాజుల్లో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. తమ ప్రజల హృదయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. కాగా, కొంత మంది రాజులు మాత్రం ప్రజల కంటే సొంత భోగాలకే ప్రాముఖ్యమిచ్చి చరిత్రలో హీనులుగా మిగిలిపోయారు. అలాంటి ఓ రాజు వికృత చేష్టలు, ఆయన జరిపిన కామక్రీడల గురించి పలు ఆశ్చర్యకర విషయాలు ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.
పుణ్యభూమి, వేదభూమియైన భారత్‌లో స్త్రీకి ఇచ్చే చాలా గౌరవం ఇస్తారు. కానీ, మనం చెప్పుకోబోయే ఈ రాజు మహిళను అంగడి సరుకుగా భావించాడు. ఆయనే పటియాల సంస్థాన రాజు భూపేందర్ సింగ్. తన పాలనతో రాజ్యాన్ని భ్రష్టుపట్టించాడు. ఈ రాజు రంగులమయ ప్రపంచాన్ని, వింత కామ క్రీడలను గురించి ఆయన వద్ద దివానుగా పని చేసిన జెర్మనీదాస్ ‘మహారాజ మహారాణి’ అనే గ్రంథం రాశాడు. దాని ప్రకారం..పటియాల సంస్థాన రాజు రాజేందర్ సింగ్‌ కుమారుడైన భూపేందర్ సింగ్ తండ్రి మరణానంతరం రాజ్యపాలకుడిగా మారాడు. రాజ్య ప్రజల రక్షణ, సంక్షేమం పక్కనపెట్టి ప్రజా కంఠకుడిగా మారాడు.

తన కోరికలు తీర్చుకోవడమే ధ్యేయంగా పాలన సాగించాడు. అందుకు ‘లీలామహల్’ను వేదిక చేసుకున్నాడు. ఆ రాజమందిరంలోకి వెళ్లే స్త్రీలు ఎవరైనా బట్టలు విప్పేసి నగ్నంగా రావాలని నియమం పెట్టాడు. అలా తన కామ క్రీడలు ఆ మహల్‌లో జరిపాడు రాజు. కోటలోని గదులను అత్యద్భతంగా అలంకరించుకుని అక్కడే గడిపే ఈ రాజు బ్రిటీష్ అధికారులతో సక్యంగా ఉండేవాడట. భారతీయ పద్ధతుల ప్రకారం తన గదిని ప్రత్యేకంగా డిజైన్  చేసుకున్న రాజు భూపేందర్ సింగ్ ఆ మహల్ పరిసరాల్లో అధికారులు, వారి భార్యలకు సెపరేట్ పార్టీలు ఇచ్చేవాడు. లీలామహల్ పటియాల నగరంలోని భూపేందర్ నగర్‌కు వెళ్లే మార్గంలో ఉంటుంది.
లీలామహల్‌కు ముందర పెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించి రాజు అక్కడ స్త్రీలతో ఈత కొట్టేవాడు. దాదాపు 150 మంది మహిళలు, పురుషులు ఒకేసారి ఆ కొలనులో ఈత కొట్టచ్చు. 10 కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న రాజు భూపేందర్ సింగ్‌కు ఒక అంచనా ప్రకారం..80 మంది పిల్లలున్నారు. రాజ్యపాలన కోసం ఉన్న మోతీలాల్ ప్యాలెస్ విడిచి ఎప్పుడూ లీలామహల్‌లోనే ఉండే భూపేందర్ సింగ్ ప్రజలను అసలు పట్టించుకునేవాడు కాదు.

ఎప్పుడూ మైధునంలో పాల్గొనాలనే ఆశ, కాంక్ష కలిగి ఉండేవాడు. మొత్తంగా భోగవిలాసాలకు అలవాటు పడి సుభిక్షమైన తన రాజ్యాన్ని, ప్రజలను పట్టించుకోలేదు. రాజుగా తను వెళ్లిన తర్వాతనే అన్ని రకాల పార్టీలు, విందులు ప్రారంభమయ్యేవి. ఇక ఆయన ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, పార్టీలకు రాజు భూపేందర్ సింగ్ యూరోపియన్, అమెరికన్ మహిళలను ఆహ్వానించి వారితో ఎంజాయ్ చేసేవారు. విదేశీమహిళలు కూడా రాజు కోరికలు తీర్చేవారు. అలా రాజు స్త్రీ లోలుడై పాలనను మరిచి పడక సుఖానికి అలవాటు పడి చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: