మల బద్ధకం ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay

మల బద్ధకం అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. అయితే ఇది వస్తే చాలా మంది రోజూ టాయిలెట్‌లో గంటల తరబడి సుఖ విరేచనం కోసం ఎంతగానో పడుతుంటారు.చెడు జీవన విధానం, తప్పుడు ఆహారపు అలవాట్లు, అతిగా భోజనం చేయడం, ఆలస్యంగా తినడం, మాంసం ఎక్కువగా తీసుకోవడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం..వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.కానీ అలాంటి పనిలేకుండా కొన్ని నాచురల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. దాంతో ఈజీగా ఈ మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఇక ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

పప్పు దినుసుల్లో మనకు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని బాగా మెరుగు పరుస్తుంది. ఇంకా అలాగే పెరుగు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీన్ని ప్రో బయోటిక్ ఆహారంగా పిలుస్తారు. పెరుగుని తింటే మన జీర్ణాశయంలో మంచి బాక్టీరియా అనేది పెరుగుతుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.పండ్ల లాగానే ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను కూడా తినవచ్చు. ఇవి కూడా విరేచన ప్రక్రియను సులభతరం చేస్తాయి. దీంతో సుఖ విరేచనం అవుతుంది. ముఖ్యంగా పాలకూర, చిలగడదుంపలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. 


వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ సమస్య నుంచి బయట పడేందుకు మనకు త్రిఫల చూర్ణం కూడా చక్కగా పనిచేస్తుంది. మనకు మార్కెట్‌లో త్రిఫల చూర్ణం లేదాట్యాబ్లెట్లు లభిస్తాయి. వీటిని డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం తగ్గుతుంది.ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. పండ్లు, కూరగాయలు, నట్స్‌, విత్తనాలు వంటి వాటిల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీంతో జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. ముఖ్యంగా యాపిల్స్, జామ పండ్లు, కివి, పియర్స్‌, అరటి పండ్లు వంటి వాటిల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలాన్ని మెత్తగా చేస్తుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: