కడుపుబ్బరాన్ని చిటికెలో తరిమెసే చిట్కాలు?

Purushottham Vinay
మనలో చాలా మందికి కూడా తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. వెంటనే గ్యాస్ అనేది చేరిపోతుంది. తక్కువ ఆహారం తీసుకున్నా చాలు కొందరికి ఈ సమస్య వస్తూనే ఉంటుంది.భోజనం చేయాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల ఎంత ఆకలిగా ఉన్నా భోజనం సరిగ్గా చేయలేకపోతుంటారు. అయితే దీన్నే కొందరు గ్యాస్ అనుకుంటారు. కానీ గ్యాస్ట్రిక్ సమస్య వేరు, కడుపు ఉబ్బరం సమస్య వేరు. గ్యాస్ట్రిక్ సమస్య కనుక ఉంటే గ్యాస్ పదే పదే రిలీజ్ అవుతుంది. కానీ కడుపు ఉబ్బరం సమస్య వస్తే గ్యాస్ ఒక  బయటకు పోదు. కడుపులో అలాగే ఉంటుంది. దీంతో చాలా రకాల ఇబ్బందులు పడతారు. అయితే మీలో ఎవరికైనా ఇలా తిన్న వెంటనే కడుపు ఉబ్బరం సమస్య కనుక వస్తుంటే అందుకు ఈ సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను ట్రై చెయ్యండి.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం టీ, కాఫీలకు బదులుగా యాపిల్ పండును లేదా ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తాగాలి. అలాగే పరగడుపునే చిన్న అల్లం ముక్కను నమిలి తినవచ్చు. ఒక టీస్పూన్ అల్లం రసం సేవించినా చాలు.


కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.నానబెట్టిన బాదంపప్పులను నాలుగైదు తిన్నా కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసం సేవించాలి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.ఇక కమోమిల్ టీని తాగుతున్నా కూడా కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. ఇది గ్యాస్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. రాత్రి పూట ఈ టీని సేవిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, నిద్ర చక్కగా పడుతుంది, పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.సోంపు గింజలతో తయారు చేసిన టీని తాగుతున్నా కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కొందరు భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ వంటివి తాగుతారు. ఇలా చేయకూడదు, ఇవి గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్యలను పెంచుతాయి.ఒక గ్లాస్‌లో చిటికెడు వంట సోడా కలిపి తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒక కీరదోసను నేరుగా అలాగే తినాలి లేదా ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: